Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భీమ్లా నాయక్ బాక్సాఫీస్ రికార్డుల కోత మొదలైంది.. అక్కడ నెంబర్ వన్ సినిమాగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద సరికొత్త సందడి నెలకొంది. గతంలో ఎప్పుడు లేని విధంగా భీమ్లా నాయక్ అడ్వాన్స్ బూకింగ్స్ తోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. ఇక సినిమా తప్పకుండా సరికొత్త సంచలనం సృష్టిస్తుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాకు సంబంధించిన యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ తో కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ప్రీమియర్స్ తో కలిపి ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంది అనే వివరాల్లోకి వెళితే...
ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని..
రానా దగ్గుబాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ భీమ్లా నాయక్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పవన్ ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులను బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే గత సినిమాలు అజ్ఞాతవాసి, వకీల్ సాబ్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో లాభాలను అందించలేదు.
హౌస్ ఫుల్ బోర్డులు
ఇక భీమ్లా నాయక్ బజ్ చూస్తేనే సినిమా తప్పకుండా అంచనాలకు మించి హిట్ అవుతుంది అని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం కూడా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ను క్రియేట్ చేసింది. హైదరాబాద్ లో అయితే దాదాపు 95% షోలు మొదటి రోజు హౌస్ ఫుల్ అయ్యేందుకు రెడీ అయ్యాయి.
అక్కడ కూడా..
పవర్ స్టార్ యూఎస్ లో కూడా మరోసారి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాడు. అక్కడ అడ్వాన్స్ బూకింగ్స్ ఓపెన్ అవ్వగానే కొన్ని థియేటర్స్ లో సాలీడ్ గా వసూళ్లు అందాయి. పలు చోట్ల ప్రీమియర్స్ కు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. రానా దగ్గుబాటి మరొక పవర్ఫుల్ పాత్రలో నటించడం అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇవ్వడం సినిమాకు భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
నెంబర్ వన్ సినిమాగా
ఓవర్సీస్ లో దాదాపు 600కు పైగా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇక ఓపెనింగ్స్ తో అయితే 2022లో నెంబర్ టాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. డీజే టిల్లు సినిమా మొదట ఈ ఏడాది అమెరికాలో హాఫ్ మిలియన్ దాలర్లను అందుకుంది. ఇక భీమ్లా నాయక్ సినిమా అయితే అడ్వాన్స్ బూకింగ్స్ తోనే హాఫ్ మిలియన్ ను చాక ఈజీగా దాటేసింది.
హాఫ్ మిలియన్ దాటేసి
మొదటి షో పదకముందే హాఫ్ మిలియన్ డాలర్లు అందుకున్న భీమ్లా నాయక్ ప్రీమియర్స్ తో బాక్సాఫీస్ వద్ద 750K డాలర్లు అందుకొని 2022 లో మొదటి రికార్డును అందుకుంది. ఇప్పటివరకు ఓవర్సీస్ టాప్ ఓపెనింగ్స్ అందుకున్న తెలుగు సినిమాలలో కూడా భీమ్లా నాయక్ టాప్ లిస్టులో చేరింది.
ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా..
తప్పకుండా సినిమా జెట్ స్పీడ్ లోనే 1 మిలియన్ మార్కును అందుకుంటుందని చెప్పవచ్చు. ఇక మొదటి రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా 27కోట్లకు పైగానే వసూళ్లను సాధిస్తుందని అంటున్నారు. ఛాన్స్ ఉంటే 30కోట్ల మార్క్ ని కూడా అందుకోవచ్చు అనే టాక్ కూడా కొనసాగుతోంది.