Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆంజినేయులు’ విడుదలకు మంత్రి పెద్ద పీట
తెలుగునాట మగధీర ప్రభంజనం కారణంగా కొన్ని సినిమాలు విడుదల విషయంలో వెనక్కి వెళ్ళిపోతుండగా అదే సమస్యే 'ఆంజినేయుల"కు ఎదురైయింది. నటుడు గణేష్ నిర్మాతగా మారి రవితేజ హీరోగా 'ఆంజనేయులు" సినిమాను పరశురామ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. గణేష్ మా కుటుంబ సభ్యుడు వంటి వాడు అన్న మంత్రి బొత్సా సత్యనారాయణ ఈ చిత్రానికి బ్యాక్ బోన్ అనే ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో బలంగా వుందనే ప్రచారం.
విజయనగరంలోని లక్ష్మి థియేటర్లో టికెట్ కౌంటర్ దగ్గర జరిగిన విద్యుద్ఘాతంలో ఐదుగురు చరిపోయిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కనీసం మృతుల కుటుంబీకులను పరామర్శించలేదు. ఇదిలా ఉంటే సదరు థియేటర్ని బ్యాన్ చేయాలని బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేయడంపట్ల చిరంజీవి అభిమానులు అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. థియేటర్ని మెరుగుపరిచే బదులు సినిమాని బ్యాన్ చేయడమేంటి? అనుకుంటున్నారు.
ఆంజనేయులు చిత్ర విడుదల కోసమే బొత్సా సత్యనారాయణ ఓవరాక్షన్ చేస్తున్నారనే విషయం స్పష్టం కావడంతో, మగధీర చిత్రాన్ని అడ్డుకొంటే బొత్సా సొంత జిల్లాలో 'ఆంజనేయులు" సినిమాని విడుదల కానివ్వమని మెగా అభిమానులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 'మగధీర" పై బ్యాన్ లిప్ట్ అవుతుందా? ఆంజినేయులు సినిమా ఎలాంటి అవాంతరాలు లేకుండా విడుదలవుతుందా? అన్నది సస్పెన్స్...