Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పూరీ జగన్నాధ్ లేటెస్ట్ చిత్రం శాటిలైట్ రైట్స్ పదమూడున్నర కోట్లు
దర్శకుడు పూరీ జగన్నాధ్, అమితాబ్ కాంబినేషన్ లో బుడ్డా హోగయా తేరా బాప్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మంచి బిజెనెస్ చేసినట్లు సమాచారం.ముఖ్యంగా ఈ చిత్రం టేబుల్ ప్రాఫిట్ ని సంపాదించి పెట్టిందని అమితాబ్ చెప్తున్నారు. అమితాబ్ ఈ విషయం ట్విట్టర్ లో రాస్తూ...ఈ చిత్రం పదిన్నర కోట్ల పరిమిత బడ్జెట్ తో నిర్మితమైంది. అయితే పదమూడున్నర కోట్లు శాటిలైట్ రైట్స్ తెచ్చిపెట్టి మూడు కోట్లు టేబుల్ ప్రాఫెట్ తెచ్చిపెట్టింది అన్నారు. ఈ చిత్రం కోసం వదిలిన ప్రోమోలు అంతటా మంచి క్రేజ్ తెచ్చిపెట్టడమే దానికి కారణం అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ..'నువ్వు ముసలాడివి' అని ఎవరైనా అంటే వాళ్ల తాట తీస్తాను. ఆ మాటే అంటే అస్సలు నచ్చదు.'బుడ్డా...ఓ కొత్త తరహా సినిమా. అందులో నేను పెద్ద డాన్ని. తమాషాగా ఉంటూనే సీరియస్గా సాగుతుంది అన్నారు.అలాగే అలాగే ఈ సినిమా చేయడానికి చాలా విషయాలు నన్ను పురిగొల్పాయి. కేవలం నా ఒక్క పాత్ర కోసమే కాదు. నా చుట్టూ ఉన్న వ్యక్తుల కదలికలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తప్పకుండా నా అభిమానులకు నచ్చుతుంది అని బిగ్ బి మురిసిపోతూ చెప్పుకొచ్చారు.