Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ది బిజెనెస్ మ్యాన్' విడుదల ప్రింట్ల సంఖ్య
మహేష్ బాబు తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ ..హైదరాబాద్ లో వంద స్క్ర్రీన్స్ తోనూ, వరల్డ్ వైడ్ గా 1100 ప్రింట్లతోనూ విడుదల చేస్తున్నట్లు సమాచారం. జనవరి 11, 2012 న విడుదల అవుతున్న ఈ చిత్రానికి సంభంధించిన ప్రమోషన్ వర్క్ అప్పుడే స్టార్టైంది. మొన్న పంజా విడుదలతో పాటు కూడా బిజినెస్ మ్యాన్ ప్రొమోలు వదిలారు. అలాగే నాగార్జున తాజా చిత్రం రాజన్న డిసెంబర్ 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు ది బిజినెస్ మ్యాన్ కొత్త ట్రైలర్స్ ని ప్రదర్శించటానికి సన్నాహాలు చేస్తున్నారు.'బిజినెస్మేన్'తమిళ, తెలుగులలో ఒకే రోజు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో విడుదల టైమ్ దగ్గరపడుతూండటంతో తమిళ డబ్బింగ్ వెర్షన్ ని ఓ ప్రక్క చాలా స్పీడుగా రెడీ చేస్తున్నారు. అందుకోసం ఓ తెలుగు దర్సక,రచయిత ఇందుకు సాయిం చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. అయితే అతను దర్శకుడు క్రిష్ అయ్యి ఉండవచ్చునని చెప్పుకుంటున్నారు.
వేదం చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేసిన అనుభవంతో ఈ ప్రాజెక్టు భారాన్ని తనపై ఎత్తుకున్నాడని అంటున్నారు. అందులోనూ ఈ మధ్య క్రిష్ ప్రాజెక్టుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా ఈ వార్తకు బలాన్ని కూరుస్తోంది. ఇక తెలుగు వెర్షన్ కి కథ,స్క్రీన్ ప్లే, మాటలను పూరీనే అందిస్తున్నారు. పోకిరి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ఉండే అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రిప్టుని పూరీ రచించటం జరిగింది. ఇక మహేష్ కి తెలుగు సహా తమిళ్లోనూ భారీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా చెన్నైలో లో అతని వీరాభిమానులు ఉన్నారు. ఈ క్రేజిని దృష్టిలో ఉంచుకుని.. తెలుగుతో పాటు తమిళ్లోనూ జనవరి 11న సినిమాని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 23న పాటలు మార్కెట్లోకి వస్తాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పాటల చిత్రీకరణ నిమిత్తం ధాయలాండ్,బ్యాంకాక్ లో మహేష్,పూరి బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డావెంకట్ నిర్మిస్తున్నారు.