Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'మహేష్ ఖలేజా' విషయమై నిర్మాత సి.కళ్యాణ్ వార్నింగ్
మహేష్ తాజా చిత్రం ఖలేజా ఓవర్ సీస్ రైట్స్ ని ఫికస్ మూవీస్ వారు సొంతం చేసుకున్నారనే సంగితి తెలిసిందే. అయితే తాజాగా వీరికి చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ వార్నింగ్ ఇఛ్చారని సమాచారం. రెండు రోజుల్లో ఖలేజా రైట్స్ కి చెందిన డబ్బుని పూర్తిగా చెల్లించమని ఆయన హెచ్చరించారు. అలాగే డబ్బు క్లియర్ కాకపోతే మరొక కంపినీకు రైట్స్ ని ఇచ్చేస్తామని మొహమాటం లేకుండా చెప్పారు. అలాగే కాన్సిలేషన్ విషయాన్ని ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి మరీ చేస్తానన్నారు. ఇంతలా కళ్యాణ్ అనటానికి కారణంగా కొమురం పులి చిత్రం విషయంలో వారు ఇష్యూ చేసిన చెక్కులు చెల్లక, సినిమా ఫెయిల్యూర్ టాక్ వచ్చి, డబ్బు తగ్గించి సెటిల్ మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అటువంటి సంఘటన మళ్ళి పునరావృతం కాకుండా సి.కళ్యాణ్ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. ఇక ఈ ఎగ్రిమెంట్ అయ్యేటప్పటికి సి.కళ్యాణ్ సీన్ లో లేరు. కేవలం నిర్మాతగా సింగనమల రమేష్ మాత్రమే ఉన్నారు. ఇక ఫికస్ మూవీస్ వారు ఈరోజు..రోబో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.