Don't Miss!
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- News సీఎం జగన్ యాత్ర పై నిఘా - కీలక నిర్ణయాలు..!!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
'కెమెరామేన్ గంగతో..' రిలీజ్ కు ముందే హిట్?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం విడుదలకు తేదీ దగ్గరపడకముందే దాదాపు నలభై మూడు కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. అదే నిజమైతే రిలీజ్ కు ముందే బిజినెస్ పరంగా మంచి హిట్ సినిమా అంటున్నారు. మొదటి నైజాం ఏరియాకు ఈ సినిమాను అల్లు అరవింద్ తీసుకున్నారు. అక్కడ నుంచి బిజినెస్ ప్రారంభమైంది.
పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. అలాగే 'కెమెరామేన్ గంగతో రాంబాబు' ప్రారంభంలోనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించి పూరీ జగన్నాధ్ తన సత్తాను మరో సారి చాటుకున్నారు. సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రానికి సమర్పించే ఈ చిత్రాన్ని అక్టోబరు 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని పూరీ చెప్పారు. దాంతో ఇండస్ట్రీ మొత్తం మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది.
పూరీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ... 'బద్రి' సినిమాతో నాకు లైఫ్ ఇచ్చిన పవన్కళ్యాణ్గారితో మరో సినిమా చేయాలని చాలా సార్లు ప్లాన్ చేశాం. కానీ ఎందుకో మా కాంబినేషన్ అలా అలా డిలే అయి ఇప్పటికి కుదిరింది. దర్శకునిగా నాకు 25వ చిత్రం. ఇది ఓ న్యూస్ రిపోర్టర్ కథ. పవన్కళ్యాణ్ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఉండే డిఫరెంట్ యాక్షన్ ఫిలిం ఇది' అన్నారు.
నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలన్న కోరిక ఇన్నేళ్లకు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే 'దేశముదురు' చిత్రం తరువాత పూరి జగన్నాథ్గారితో మళ్లీ సినిమా చేస్తున్నాం. మా బేనరులో ఇది ఓ సెన్సేషనల్ మూవీ అవుతుంది' అన్నారు. ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటించే ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.