Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కొందరికే లాభం: సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ క్లోజింగ్ కలెక్షన్స్
సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ 'చిత్రలహరి'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుసగా 6 ప్లాపుల తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు ఈ సినిమాతో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. బాక్సాఫీసు వద్ద 4 వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బిజినెస్ దాదాపు అన్ని ఏరియాల్లో క్లోజ్ అయింది.
'మహర్షి' రాకతో తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్ల నుంచి 'చిత్రలహరి'ని తీసేశారు. రెండు మూడు ఏరియాల్లో చిన్నపాటి నష్టం తప్ప దాదాపు అందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా ద్వారా లాభాలు తమ ఖాతాలో వేసుకోవడం పాటు పెట్టుబడి రాబట్టకున్నారు.
చిత్రలహరి వరల్డ్ వైడ్ రైట్స్ రూ. 12.80 కోట్లకు అమ్మగా... ఫుల్రన్లో రూ. 14.57 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమా విడుదలైన తొలి వారాంతంలోనే రూ. 9.35 షేర్ వసూలవ్వగా ఓవరాల్ రనల్లో ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో లాభాల దిశగా అడుగులు వేసింది.
ఏరియా వైజ్ ప్రాఫిట్స్ పరిశీలిస్తే... నైజాం డిస్ట్రాబ్యూటర్ రూ.3.15 కోట్లకు రైట్స్ అమ్మగా... రూ. 4.40 కోట్లు రాబట్టంది. సీడెడ్ ఏరియా రైట్స్ రూ. 1.71 కోట్లకు అమ్మగా.. రూ. 2.18 కోట్లు వసూలు చేసింది. ఉత్తరాంధ్ర రూ. 1.32 కోట్లకు అమ్ముడవగా రూ. 1.90 రాబట్టింది.
ఈస్ట్ గోదావరి (రూ. 1 కోటి), నెల్లూరు(రూ. 5 లక్షలు), రెస్టాఫ్ ఇండియా(రూ. 1 కోటి)లో పెట్టుబడి తిరిగి వచ్చింది. కృష్ణ, గుంటూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లకు చిన్నపాటి నష్టాలు తప్పలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ పబ్లిసిటీ కలిపి రూ. 1.5 కోట్లు ఖర్చు పెట్టగా రూ. 1 కోటి మాత్రమే తిరిగొచ్చింది.
సాయిధరమ్తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరో హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని.