"దమ్ము" 50 డేస్ సెంటర్లు ఎన్ని..ఎక్కడ?
ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందిన చిత్రం దమ్ము. ఈ చిత్రం జూన్ 15,2012 తో 50 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్రం మొత్తం మీద మొత్తం 25 సెంటర్లలలో ఈ చిత్రం ఈ యాభై రోజులు పూర్తి చేసుకుంది.
ఆ వివరాలు...జిల్లాల వారిగా
నైజాం... 02
సీడెడ్ ... 09
నెల్లూరు ... 01
కృష్ణా ... 03
గుంటూరు ...03
వైజాగ్ ... 04
ఈస్ట్ గోదావరి ... 03
వెస్ట్ గోదావరి ... 00
మొత్తం సెంటర్లు : 25
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ...ఎన్టీఆర్ నటనను ఇప్పటిదాకా ఒకవైపే చూశారు. రెండోవైపు చూపించే చిత్రమిది. నడక, స్త్టెల్... అన్ని విషయాల్లోనూ వైవిధ్యం ప్రదర్శించారు. ప్రతి ప్రేక్షకుడు సంతృప్తిపడేలా, ప్రతి అభిమానీ గర్వపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కీరవాణి స్వరపరిచిన పాటలకి చక్కటి స్పందన లభిస్తోంది. సినిమా ఇంత విజయం సాధించటానికి ఆ ఎలిమెంట్స్ అన్నీ సహకరించాయి.. నిర్మాత వల్లభ సహకారం మరిచిపోలేనిదని అన్నారు.
బోయపాటి శ్రీను దర్సకత్వంలో ఎన్టీఆర్,త్రిష,కార్తీక కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'దమ్ము'. భానుప్రియ, నాజర్, సుమన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. రచన: ఎమ్.రత్నం, పాటలు: చంద్రబోస్, కెమెరా: ఆర్థర్ విల్సన్. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత. కె.ఎస్.రామారావు సమర్పకులు.


Click it and Unblock the Notifications











