Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
‘దేవుడు చేసిన మనుషులు’ఫైనల్ టాక్
హైదరాబాద్: రవితేజ, ఇలియానా కాంబినేషన్లో రూపొంది మొన్న బుధవారం విడుదలైన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. సినిమా మార్నింగ్ షో కే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అదే టాక్ ఫైనల్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే..శుక్రవారం నుంచి ఈ చిత్రం కొన్ని ధియోటర్స్ లో తీసేస్తున్నారు. ఈ రెండు రోజులు టాక్ కి అతీతంగా కలెక్షన్స్ నడిచాయి. అయితే స్లో ఫుల్స్ అవుతున్నట్లుగా చెప్తున్నారు. సోమవారం నుంచి ఈ కలెక్షన్స్ కూడా ఉండకపోవచ్చునని అంటున్నారు.
ఇక దర్శకుడు పూరీ జగన్నాధ్ రిలీజ్ కు ముందే ఈ చిత్రంలో కథ వంటివేమీ లేవని చెప్పేసారు. దాంతో కేవలం పాటలు,ఫైట్ లు,కామెడీ ట్రాక్ తో సినిమా నడిపేసారు. అయితే ఈ ప్రయోగం జనాలకి నచ్చినట్లు లేదు. ఎ సెంటర్లలో ఓ మాదిరిగా ఉన్నా, బి సెంటర్లలో రవితేజ క్రేజ్ తో లాగవచ్చు అంటున్నారు. ఈ సినిమా రిజల్టుని బట్టే జులాయి హవా కొనసాగేదీ లేనిదీ ఆధారపడి వుంటుంది. మరో ప్రక్క అందాలరాక్షసి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోయాయి.
అలాగే జులాయి వారం రోజుల పాటు కలెక్షన్లు బాగానే రాబట్టింది. రెండో వారంలో కూడా సెలవులు వుండడంతో ఇబ్బంది లేదు. దేముడు చేసిన మనుష్యులు,అందాల రాక్షసి కూడా ఊహించని విధంగా భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిన అంశం. త్వరలో పెద్ద సినిమాలు ఈ సినిమాకు పోటి వచ్చేవి కనపడటం లేదు. దాంతో ఈ లోగా ఈ సినిమా కలెక్షన్స్ వీకెండ్ లో బాగా ఊపందుకుని నిర్మాతకు లాభాలు తెచ్చిపెడతాయని అంచనా వేస్తున్నారు.
రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే, పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్ ఆర్ శేఖర్. కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్సకత్వం...పూరీ జగన్నాధ్.