twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు కే రైట్స్ ...డబ్బులు వర్షం

    By Srikanya
    |

    Dil Raju Buys Mahesh's Aagadu Rights
    హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత దిల్ రాజు కన్ను పడిందంటే ఆ చిత్రానికి దశ తిరిగినట్లే. ఆయన తాజాగా 'ఆగడు' చిత్రం ఉత్తరాంధ్ర రైట్స్ తీసుకున్నారు. ఐదు కోట్లు ఈ రైట్స్ కోసం వెచ్చించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అక్కడ మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో కలెక్షన్స్ ఊపేస్తాయని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆగడు బిజినెస్ ఓ రేంజిలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దూకుడు వంటి సూపర్ హిట్ వచ్చిన క్రేజీ కాంబినేషన్ కావటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ ప్రభావం బిజినెస్ పైనా కనపుడుతోందని నిర్మాతలు ఆనందపడుతున్నారు.

    మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లారు మహేష్. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ముంబై తర్వాత కేరళ షెడ్యూలు వెళ్లనున్నారు. ముంబై షెడ్యూలు 15 రోజులు పాటు జరగనుంది. కేరళలలో కొన్ని కీలకమైన లవ్ సీన్స్ తీయనున్నారని సమాచారం. అక్కడ అందమైన లొకేషన్స్ లో ఈ సీన్స్ ప్లాన్ చేసారని సమాచారం.

    కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కు మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. 14 రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

    'ఆగడు' టీజర్‌ లో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది.

    పంచ్‌ డైలాగు లేకపోతే.. టీజర్‌, ట్రైలర్‌ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్‌ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్‌ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

    English summary
    Dil Raju, has bought the Uttarandhra rights of Mahesh Babu’s Aagadu. Raju has reportedly bought this for a whopping amount of more than 5 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X