Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దిల్ రాజుపై 'దూకుడు' ఎఫెక్ట్
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు దూకుడు చిత్రం ఎఫెక్ట్ బాగా పడిందిందని, దాంతో ఆయన తాజా చిత్రం ఓ మై ప్రెండ్ కి యుఎస్ మార్కెట్లో మంచి రేటు పలికిందని ట్రేట్ లో టాక్. దూకుడు రికార్డు కలెక్షన్స్ తో అంతకుముందు వరస ఫ్లాపులతో చల్లపడ్డ ఓవర్ సీస్ మార్కెట్ ఒక్కసారిగా రైజ్ అయ్యింది. ట్రేడ్ లో మంచి కాన్ఫిడెన్స్ ఏర్పడింది.దాంతో దిల్ రాజుకు బాగా కలిసి వచ్చిందని చెప్తున్నారు. నిజానికి సిద్దార్ధకు వరస ప్లాఫ్ లతో అస్సలు తెలుగులో మార్కెట్ లేదు. మరో ప్రక్క ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. కానీ దిల్ రాజు మీద ఉన్న నమ్మకం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చేటట్లు చేస్తోంది. అందులోనూ అర్బన్ లవ్ స్టోరీగా, యుత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యటం కూడా సినిమా మార్కెట్ కు కలిసి వచ్చిన అంశం.
సిద్దార్ద హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రం 11.11.11న ఉదయం 11గంటలకు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సిద్ధార్థ, శృతి హాసన్, హన్సిక, నవదీప్ ముఖ్య తారాగణంలో వస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధినేతలు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్లు నిర్మిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... నేడు యువతలో ఉన్న కన్ఫ్యూజన్స్, ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలన్నీ కలగలిపి వేణు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'బొమ్మరిల్లు' తర్వాత మా సంస్థలో సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా ఇది. అతను మంచి నటుడనే సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంలో ఎక్కువ భాగం శ్రుతిహాసన్ కొట్టేస్తుంది అన్నారు.
దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ "ఇలాంటి సినిమా దిల్ రాజుగారు మాత్రమే తియ్యగలరు. స్వతహాగా మంచి ఆర్టిస్టు అయిన సిద్ధార్థ్ ఎంతో ఎఫర్ట్పెట్టి నటించాడు. శ్రుతి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆమెలో ఓ కొత్తకోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు'' అని చెప్పారు. అలీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, లక్ష్మీ రామకృష్ణన్, వినయ ప్రసాద్ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, కృష్ణచైతన్య, ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి, డాన్స్: రాజు సుందరం, దినేశ్, రఘు, సుచిత్ర, కళ: ఎస్. రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వేణు శ్రీరామ్.