Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షాకింగ్: సల్మాన్ 100 కోట్లు... బన్నీ 43 కోట్లు!
ముంబై/హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ దెబ్బకు బాక్సాఫీసు షేక్ అవుతోంది. నిర్మాతలు, డిస్టిబ్యూటర్లకు కాసుల వర్షం కురుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన 'ఏక్ థా టైగర్' చిత్రం రికార్డు స్థాయిలో ఐదు రోజుల్లో 100 కోట్ల కలెక్షన్ సాధించింది.
సల్మాన్ ఖాతాలో ఏక్ థా టైగర్ 100 కోట్లు దాటిన 4వ చిత్రంగా రికార్డులకెక్కింది. గతంలో సల్మాన్ నటించిన రెడీ చిత్రం రూ. 122 కోట్లు, బాడీగార్డ్ చిత్రం రూ. 148, దబాంగ్ చిత్రం రూ. 147 కోట్ల వసూలు చేసింది. తాజాగా ఏక్ థా టైగర్ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల మార్కు దాటడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈచిత్రం తప్పకుండా రూ. 150 కోట్లు క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' చిత్రం తొలి వారంలోనే వరల్డ్ వైడ్గా 43 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే టాప్ 5 ఫస్ట్ వీక్ గ్రాసర్లలో 'జులాయి' చిత్రం స్థానం దక్కించుకుంది. అల్లు అర్జున్ కెరీర్లోనే 'జులాయి' చిత్రం బిగ్ హిట్ గా స్థానం సంపాదించుకుంది.