Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఈ వారం శ్రీదేవి, అనుష్క మధ్యే...
హైదరాబాద్: ఈ శుక్రవారం(అక్టోబర్ 5)న రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి. అయితే రెండూ డబ్బింగ్ చిత్రాలే కావటం విశేషం. మొదటిది విక్రమ్, జగపతి బాబు కాంబినేషన్ లో రూపొందిన శివతాండవం చిత్రం. అలాగే రెండో చిత్రం శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్ వింగ్లిష్' . ఈ రెండు చిత్రాలు పెద్దగా క్రేజ్ లేవు కానీ ఓపినింగ్స్ వరకూ బాగా తెచ్చుకునే అవకాసం ఉందని అంటున్నారు. శివ తాండవం చిత్రం మాస్ ని ఉద్దేశించింది అయితే, ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం మల్టి ప్లెక్స్ లను టార్గెట్ చేస్తున్నారు.
'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రం విషయానికి వస్తే... ఇంగ్లీష్ తెలియక ఇబ్బందులు పడే ఓ గృహిణికి సంబంధించిన ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించగా ఆర్.బాల్కి నిర్మించారు. తనలోని భావాలు వివరించడానికి తగ్గ ఇంగ్లీష్ పరిజ్ఞానం లేక భర్త విషయంలోనూ, సమాజంలో ఎదురయ్యే వ్యక్తులతోను ఇబ్బంది పడుతూ, సిగ్గుపడుతూ ఈ లోపాన్ని సవరించుకోడానికి 'ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్'లో చేరి విశేషంగా కృషి చేసి, ఇంగ్లీషులో పాండిత్యం సంపాదించి ఎదుటివాళ్లను అవాక్కయ్యేలా చేసే 'శశి' పాత్రను శ్రీదేవి పోషించింది. గ్లామర్ నటిగానే కాక, హాస్యం, చిలిపితనం కూడా తను పోషించే పాత్రలో వివిధ రసభావాలను తన మేనులో, ముఖంలో, సంభాషణల్లో పలికించి సత్తాచూపిన నటిగా గుర్తింపు పొందిన శ్రీదేవి 'ఇంగ్లీష్ వింగ్లిష్' పాత్ర పోషణ విషయంలో అదే తరహాలో భావాలు పలికించిందని బాలీవుడ్ సమాచారం.
విక్రమ్, జగపతి బాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్ దర్శ కత్వంలో సి.కళ్యాణ్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రం అక్టోబర్ 5న విడదల అవుతున్న ఈ చిత్రంలో విక్రమ్ ఓ ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే ఈ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్ కనిపించటం. ఇక ఈ చిత్రం మరో ప్రత్యేకత ఏమిటీ అంటే..అనుష్క. ఆమె చిత్రం ప్లాష్ బ్యాక్ లో కనపడనుందని తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ గా చేస్తున్న అమీ జాక్సన్ పాత్ర హైలెట్ కానుంది.
ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే... లండన్లోని బహుళ అంతస్థుల భవనం అది. అక్కడికి రోజూ వేలమంది వస్తుంటారు. వెళ్తుంటారు. ఓ రాత్రి ఆ భవనం పైనుంచి పడి ఓ యువకుడు మరణిస్తాడు. అది హత్య, ఆత్మహత్య అనేది అక్కడి భద్రతా సిబ్బందికి అర్థం కాదు. సీసీ కెమెరాలను చూస్తే ఓ ఆధారం దొరికింది. ఆ మరణం వెనుక ఎవరున్నారో అర్థమైంది. ఇంతకీ ఈ రహస్యాన్ని ఎలా ఛేదించారు? ఈ కుట్ర వెనుక ఎవరు దాగున్నారు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'శివతాండవం' సినిమా చూడాలి.