Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
F3 షాకింగ్ బడ్జెట్.. హీరోలకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే?
విక్టరీ వెంకటేశ్ వరుణ్ తేజ్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ F 3 సినిమా ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో ప్రస్తుతం చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఇప్పటికే సినిమా టీజర్ ట్రైలర్ తో పాటు పాటలు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. ఎఫ్ 2 సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో వెంకటేశ్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజ్ గా వస్తున్నా ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అనిపిస్తోంది. ఇక ఈ సినిమా టికెట్ల రేట్లను కూడా ఏమాత్రం పెంచకుండా ప్రభుత్వం ఇచ్చిన రేట్లతోనే విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు 45 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే అందులో ఎక్కువగా హీరోలు ఇద్దరికీ వారి కెరీర్ లోనే అత్యధిక పారితోషికం కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా కోసం వెంకటేష్ గతంలో ఎప్పుడూ లేని విధంగా 10 కోట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరొక హీరో వరుణ్ తేజ్ ఎనిమిది కోట్ల వరకూ పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఇద్దరు కూడా F 2తో మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పారితోషికాలు పెరిగాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాకి భారీ స్థాయిలోనే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను సాధిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్, సోనాల్ నటించారు. పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్ లో అలరించబోతోంది.