Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'స్వామి రారా' ఫైనల్ టాకేంటి?!
ఈ చిత్రానికి హీరో నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రొమాంటిక్,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందారు. చిత్రంలో వినాయకుడి విగ్రహానికీ, ఓ దొంగ ప్రేమ కథకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. కథ ప్రకారం సూర్య (నిఖిల్) ఓ జేబుదొంగ. బతుకుదెరువు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అతనికి స్వాతి (స్వాతి) అనే ఓ పాత్రికేయురాలితో పరిచయం అవుతుంది. మరోవైపు అనంతపద్మనాభస్వామి గుడిలో కనీవినీ ఎరుగని సంపద దొరుకుతుంది. అయితే అందులోంచి ఓ వినాయక విగ్రహం మాయం అవుతుంది. ఆ విగ్రహం కోసం కొంతమంది అన్వేషణ మొదలుపెడతారు. సూర్య, స్వాతిలు కూడా విఘ్నేశ్వరుడి కోసం వేట ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ విగ్రహం ఏమైంది? ఎవరికి దొరికింది? అనేదే చిత్ర కథ.
దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నేర పరిశోధన నేపథ్యంగా సాగుతుంది. నిఖిల్, స్వాతిల జంట చూడముచ్చటగా ఉంటుంది. తెరపై కనిపించే ప్రతి పాత్రకూ ఓ ప్రాధాన్యం ఉంటుంది. రవిబాబు విలన్ గా కనిపిస్తారు. అసలే దొంగ. ఆపై ప్రేమలో పడ్డాడు. ప్రేయసి కూడా.. 'దొరికిందంతా దోచేయ్.' అని ప్రోత్సహించే రకం. ఆ ఉత్సాహంలో మరింత రెచ్చిపోయాడు. కంటికి కనిపించిందల్లా జేబులోకి తోసేశాడు. వీరిద్దరూ కలసి చేసిన హంగామా ఎలాంటిదో తెలియాలంటే మా సినిమా చూడండి అన్నారు. సరదాగా సాగే ప్రేమకథ ఇది ''అన్నారు.