twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాలుగు రిలీజులు..నాలుగు ప్లాపులు(ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    గడిచిన వారం ప్రేక్షకుల తీర్పును కోరుతూ నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అవి రామ్‌గోపాల్‌వర్మ 'దొంగల ముఠా", సుమంత్ "రాజ్", ఉపేంద్ర 'రజని", మరో చిత్రం 'కారాలు-మిరియాలు". ఈ చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఎక్కువ హైప్ క్రియేట్ చేసిన చిత్రం వర్మ 'దొంగల ముఠా". కేవలం ఐదు రోజుల్లో చిత్రం షూటింగ్ పూర్తి చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన వర్మ ఈ చిత్రం ద్వారా ఘోర పరాజయాన్నే తన ఖాతాలో వేసుకున్నారు. చిత్రం కథలో విషయం లేకపోవటమే కాక టెక్నికల్ గానూ పూర్ గా ఉంది. వర్మ అభిమానులు సైతం ఈ చిత్రాన్ని చూసి తిట్టుకుంటూ వస్తున్నారు.

    ఇక ఈ చిత్రం తర్వాత చెప్పుకోవాలింది రాజ్. సుమంత్, ప్రియమణి, విమలారామన్ కాంబినేషన్ లో మనసంతా నువ్వే దర్సకుడు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన 'రాజ్"లో ఎక్సపోజింగ్ పై పెట్టిన దృష్టి కథా,కథనాలపై పెట్టక చతికిలపడింది. ఇక నవకేశ్, మధుశాలిని జంటగా వచ్చిన 'కారాలు-మిరియాలు" ఫరలేదంటున్నారు కానీ ధియోటర్ లో ప్రేక్షకులు మాత్రం కనపడటం లేదు. అలాగే ఉపేంద్ర హీరోగా నటించిన 'రజని" చిత్రంభాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇలా ఈ వారం విడుదలైన చిత్రాలేవీ అంతగా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయాయి. ఈ చిత్రాలకు కలెక్షన్లు సైతం నిరాశజనకంగానే ఉండడంతో బాక్సాఫీస్ ఉసూరుమంటోంది.

    English summary
    Last Friday four telugu films released. But all are closed with flop at Box Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X