Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాలుగు రిలీజులు..నాలుగు ప్లాపులు(ట్రేడ్ టాక్)
గడిచిన వారం ప్రేక్షకుల తీర్పును కోరుతూ నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అవి రామ్గోపాల్వర్మ 'దొంగల ముఠా", సుమంత్ "రాజ్", ఉపేంద్ర 'రజని", మరో చిత్రం 'కారాలు-మిరియాలు". ఈ చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఎక్కువ హైప్ క్రియేట్ చేసిన చిత్రం వర్మ 'దొంగల ముఠా". కేవలం ఐదు రోజుల్లో చిత్రం షూటింగ్ పూర్తి చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన వర్మ ఈ చిత్రం ద్వారా ఘోర పరాజయాన్నే తన ఖాతాలో వేసుకున్నారు. చిత్రం కథలో విషయం లేకపోవటమే కాక టెక్నికల్ గానూ పూర్ గా ఉంది. వర్మ అభిమానులు సైతం ఈ చిత్రాన్ని చూసి తిట్టుకుంటూ వస్తున్నారు.
ఇక ఈ చిత్రం తర్వాత చెప్పుకోవాలింది రాజ్. సుమంత్, ప్రియమణి, విమలారామన్ కాంబినేషన్ లో మనసంతా నువ్వే దర్సకుడు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన 'రాజ్"లో ఎక్సపోజింగ్ పై పెట్టిన దృష్టి కథా,కథనాలపై పెట్టక చతికిలపడింది. ఇక నవకేశ్, మధుశాలిని జంటగా వచ్చిన 'కారాలు-మిరియాలు" ఫరలేదంటున్నారు కానీ ధియోటర్ లో ప్రేక్షకులు మాత్రం కనపడటం లేదు. అలాగే ఉపేంద్ర హీరోగా నటించిన 'రజని" చిత్రంభాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇలా ఈ వారం విడుదలైన చిత్రాలేవీ అంతగా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయాయి. ఈ చిత్రాలకు కలెక్షన్లు సైతం నిరాశజనకంగానే ఉండడంతో బాక్సాఫీస్ ఉసూరుమంటోంది.