Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భారీ లాభాలతో విజయ్ దేవరకొండ మూవీ బిజినెస్ క్లోజ్, ఏరియా వైజ్ ఫైనల్ రిపోర్ట్!
విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది 'గీత గోవిందం' మూవీ. పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైన బాక్సాఫీసు వద్ద ఎవరూ ఊహించని సంచలన విజయం సాధించింది. రూ. 110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. విజయ్ దేవరకొండను స్టార్ హీరో రేంజికి తీసుకెళ్లింది. ఇప్పటికే 59 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బిజినెస్ ముగిసింది. గతవారమే దాదాపు అన్ని థియేటర్ల నుండి సినిమాను తీసేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫైనల్గా ఈ మూవీ ఎంత వసూలు చేసిందనే వివరాలు బయటకు వచ్చాయి.
వరల్డ్ వైడ్ షేర్ ఎంతంటే..?
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘గీత గోవిందం' చిత్రం ఓవరాల్ రన్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 68.20 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఇంత భారీ షేర్ రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
లాభం ఎంతంటే..?
ఈ చితం థియేట్రికల్ రైట్స్ కేవలం రూ. 15 కోట్లకు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయి. పెట్టిన పెట్టుబడికి నాలుగైదు రెట్ల లాభాలు తెచ్చి టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది.
ఏరియా వైజ్ఎంతకు అమ్మారు?
ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలికి రూ. 10.50 కోట్లకు అమ్మారు. కర్నాటక రైట్స్ రూ. 1.30 కోట్లకు, రెస్టాఫ్ ఇండియా రూ. 50 లక్షలకు, ఓవర్సీస్ రైట్స్ రూ. 2.70 కోట్లకు విక్రయించారు.
ఏరియా వైజ్ వసూలైన షేర్ ఎంత?
ఈ చిత్రానికి నైజాంలో రూ. 10.60 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 6.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.16 కోట్లు, గుంటూరులో రూ. 3.80 కోట్లు, కృష్ణలో రూ. 3.67 కోట్లు, నెల్లూరులో రూ. 1.72 కోట్లు, కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.30 కోట్లు, ఓవర్సీస్లో రూ. 11.25 కోట్ల షేర్ వసూలైంది.
గీత గోవిందం
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బేనర్లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో విడుదలైన ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు.