Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కలెక్షన్స్: మిక్స్డ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద బలంగా 'పంతం'!
యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం పంతం. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. దర్శకత్వం, గోపిచంద్ నటన బావున్నపటికి కథ పాతపంథాలో ఉండడంతో డివైడ్ టాక్ వస్తోంది. గోపీచంద్ కు సరైన విజయం దక్కి చాలా కాలమే అవుతోంది. ఈ చిత్రానికి తొలి రోజు వసూళ్లు మాత్రం బలంగా ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తొలిరోజే ఈ చిత్రం 23 శాతం రికవరీ సాధించినట్లు తెలుస్తోంది.
తొలిరోజు వసూళ్లు
టాక్ ఎలా ఉన్నప్పటికీ పంతం చిత్రం తొలి రోజు వసూళ్లు చిత్ర యూనిట్ కు ఆశాజనకంగా ఉన్నాయి. తొలి రాజు ఈ చిత్రం 5 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు కోట్లకు పైగా షేర్ ఉంది.
Recommended Video
గౌతమ్ నందతో పోల్చుకుంటే
గౌతమ్ నంద చిత్రంతో పోల్చుకుంటే పంతం చిత్రం తొలిరోజే 23 శాతం వసూళ్లు రికవరీ సాధించినట్లు తెలుస్తోంది. ఇదే జోరు వీకెండ్ మొత్తం కొనసాగితే పంతం చిత్రం గట్టున పడ్డట్లే.
తేజ్ ఐ లవ్ యూతో పోటీ
తేజ్ ఐ లవ్ యూ చిత్రంతో శుక్రవారం నుంచి పోటీ ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో పంతం చిత్ర వసూళ్లపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కలిసొచ్చిన అంశాలు
డెబ్యూ దర్శకుడు చక్రవర్తి దర్శకత్వ ప్రతిభ, గోపీచంద్ నటన, మెహ్రీన్ గ్లామర్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యాయి. రాబోవు రోజుల్లో ఈ చిత్ర వసూళ్లు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.
నైజాం ఏరియాలో
నైజాం ఏరియాలో పంతం చిత్రం 1 కోటి 12 లక్షలు వసూలు చేసింది. గోపిచంద్ చిత్రాలలో ఇవి మంచి కలెక్షన్లే అని చెప్పొచ్చు.
ఆంధ్ర, సీడెడ్
సీడెడ్ లో 47లక్షలు, గుంటూరులో 33 లక్షలు, కృష్ణలో 15 లక్షల వసూళ్లు రాబట్టింది. ఈస్ట్ గోదావరిలో 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో 16 లక్షలు రాబట్టడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా
పంతం చిత్రం కేవలం తెలుగురాష్ట్రాల్లోనే 2.92 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్ లో 20 లక్షల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా పంతం చిత్రం 5.2 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్స్ షేర్ 3.2 కోట్లు కావడం విశేషం.