Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కలెక్షన్స్: మిక్స్డ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద బలంగా 'పంతం'!
యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం పంతం. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. దర్శకత్వం, గోపిచంద్ నటన బావున్నపటికి కథ పాతపంథాలో ఉండడంతో డివైడ్ టాక్ వస్తోంది. గోపీచంద్ కు సరైన విజయం దక్కి చాలా కాలమే అవుతోంది. ఈ చిత్రానికి తొలి రోజు వసూళ్లు మాత్రం బలంగా ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తొలిరోజే ఈ చిత్రం 23 శాతం రికవరీ సాధించినట్లు తెలుస్తోంది.
తొలిరోజు వసూళ్లు
టాక్ ఎలా ఉన్నప్పటికీ పంతం చిత్రం తొలి రోజు వసూళ్లు చిత్ర యూనిట్ కు ఆశాజనకంగా ఉన్నాయి. తొలి రాజు ఈ చిత్రం 5 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు కోట్లకు పైగా షేర్ ఉంది.
Recommended Video
గౌతమ్ నందతో పోల్చుకుంటే
గౌతమ్ నంద చిత్రంతో పోల్చుకుంటే పంతం చిత్రం తొలిరోజే 23 శాతం వసూళ్లు రికవరీ సాధించినట్లు తెలుస్తోంది. ఇదే జోరు వీకెండ్ మొత్తం కొనసాగితే పంతం చిత్రం గట్టున పడ్డట్లే.
తేజ్ ఐ లవ్ యూతో పోటీ
తేజ్ ఐ లవ్ యూ చిత్రంతో శుక్రవారం నుంచి పోటీ ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో పంతం చిత్ర వసూళ్లపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కలిసొచ్చిన అంశాలు
డెబ్యూ దర్శకుడు చక్రవర్తి దర్శకత్వ ప్రతిభ, గోపీచంద్ నటన, మెహ్రీన్ గ్లామర్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యాయి. రాబోవు రోజుల్లో ఈ చిత్ర వసూళ్లు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.
నైజాం ఏరియాలో
నైజాం ఏరియాలో పంతం చిత్రం 1 కోటి 12 లక్షలు వసూలు చేసింది. గోపిచంద్ చిత్రాలలో ఇవి మంచి కలెక్షన్లే అని చెప్పొచ్చు.
ఆంధ్ర, సీడెడ్
సీడెడ్ లో 47లక్షలు, గుంటూరులో 33 లక్షలు, కృష్ణలో 15 లక్షల వసూళ్లు రాబట్టింది. ఈస్ట్ గోదావరిలో 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో 16 లక్షలు రాబట్టడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా
పంతం చిత్రం కేవలం తెలుగురాష్ట్రాల్లోనే 2.92 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్ లో 20 లక్షల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా పంతం చిత్రం 5.2 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్స్ షేర్ 3.2 కోట్లు కావడం విశేషం.