twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గ్రీకు వీరుడు' విడుదల తేదీ మళ్లీ మారింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున, నయనతార జంటగా నటించిన చిత్రం 'గ్రీకు వీరుడు'. దశరథ్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెర మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ చిత్రాన్ని మొదట ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అదే రోజు వెంకటేష్ తాజా చిత్రం షాడో విడుదల ఉండటంతో తమ రిలీజ్ డేట్ ని మార్చినట్లు సమాచారం. ఇప్పటికే షాడో చిత్రం సెన్సార్ పూర్తి అయ్యి ఏప్రియల్ 26 న విడుదల అవుతోంది. థియోటర్స్ సమస్య రాకుండా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    గ్రీకు వీరుడు సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ-"నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. తొలికాపీ సిద్ధం. వంద శాతం మే 3 న రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకి స్పందన బావుంది. థమన్ సంగీతం హైలైట్. వేసవి కానుకగా వస్తున్న ఈ చిత్రంలో ప్రేక్షకాభి మానులు ఆశించే అన్ని అంశాలూ ఉన్నాయి. మా బేనరులో మరో సూపర్‌హిట్ అందుకోనున్నాం'' అన్నారు.

    గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

    మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు.

    ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

    English summary
    
 Clash between Shadow and Greekuveerudu has been avoided . Earlier, producers of both the films announced that they are releasing their respective films on April 26th. But veteran director and producer Dasari Narayana Rao arranged a meeting with the producers and told them to avoid the direct fight, as it doesn't augur well for the film industry. He convinced them to release their films with a 'healthy' gap. They agreed to his suggestion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X