పవన్ ఎఫెక్ట్ : రూ. 20 కోట్ల క్లబ్లోకి నితిన్!
హైదరాబాద్ : స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అయిన యంగ్ హీరో నితిన్....పవర్ స్టార్ మేనియాను తన తాజా సినిమా 'గుండెజారి గల్లంతయ్యిందే'కు అప్లై చేసి మంచి ఫలితాలనే రాబట్టాడు. బాగా పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలోని పాటతో పాటు, ఖుషి సినిమాలోని సెక్సీ నడుము సీన్ ఉండటం సినిమాకు బాగా ప్లస్సయింది.
సినిమా ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్, బ్రాండ్ న్యూ లవ్ స్టోరీరీ తోడు....పవన్ ఎఫెక్టు కూడా తోడవటంతో సినిమా వసూళ్ల పరంగా దూసుకెలుతోంది. ఈ చిత్రం వసూళ్ల పరంగా త్వరలో రూ. 20 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు.
రూ. 11 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 29 వరకు రూ. 11.26 కోట్ల షేర్ సాధించింది. సినిమా బిజినెస్ పూర్తయ్యేలోపు 20 కోట్లు సులభంగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు ఈచిత్రం శాటిలైట్ రైట్స్ జెమినీటీవీ రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది.
ఏరియాల వారిగా 11 రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే...
నైజాం : రూ. 4.88 కోట్లు
సీడెడ్ : రూ. 1.32 కోట్లు
ఈస్ట్, వెస్ట్, నెల్లూరు : రూ. 1.80 కోట్లు
వైజాగ్ : రూ. 1.25 కోట్లు
గుంటూరు : రూ. 80 లక్షలు
కర్నాటక : రూ. 40 లక్షలు
ఓవర్సీస్ : రూ. 81 లక్షలు
మొత్తం : రూ. 11. 26 కోట్లు
నితిన్ గత సినిమా ఇష్క్ రూ. 8.5 కోట్లతో నిర్మితమై రూ. 12.5 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రానికి రూ. 2.6 కోట్లు శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చాయి. 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రంతో వరుస విజయాన్ని అందుకున్న నితిన్ రేంజి బాగా పెరిగింది. ప్రస్తుతం మనోడి రెమ్యూనరేషన్ కూడా పెరిగిందట.


Click it and Unblock the Notifications











