Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మన సినిమా రీమేక్ కుమ్మేస్తోంది
ముంబై: ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు రీమేకులు చేయటం పరిశ్రమకు కొత్తేం కాదు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన 'పరుగు' సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని రీసెంట్ గా హిందీ లో రీమేక్ చేసారు. 'హీరోపంతి' పేరుతో ఈ సినిమాని సాజిద్ నదియడ్వాలా నిర్మించారు. ఈ చిత్రంతో తో బాలీవుడ్ టైగర్ ష్రాఫ్ (జాకీ ష్రాఫ్ కుమారుడు) పరిచయమయ్యారు. రిలీజ్ కు ముందు నుంచి సినిమాపై నెగిటివ్ టాక్ నడుస్తోంది. అయితే రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా హిట్ టాక్ మొదలైంది. కలెక్షన్స్ చాలా బాగున్నాయని కొనుక్కున్నవాళ్లు సంతోషపడుతున్నారు.
రూ. 25 కోట్ల వ్యయంతో తయారైన ఈ సినిమా మొదటి పది రోజుల్లోనే రూ. 44.20 కోట్ల (నెట్)ను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ వసూళ్లు కేవలం భారతీయ మార్కెట్కు సంబంధించినవి మాత్రమే. ఓవర్సీస్ కలెక్షన్లు, శాటిలైట్ హక్కులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమా నిర్మాతకూ, డిస్ట్రిబ్యూటర్లకూ లాభాల పంటను పండించినట్లే. ఈ కలెక్షన్లు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
సినిమా విడుదలకు ముందు ప్రోమోస్లో టైగర్ కనిపించిన తీరు పట్ల జోకులు వచ్చాయి. చాలామంది ఈ సినిమా ఫ్లాపవడం ఖాయమన్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా అనూహ్యమైన వసూళ్లను సాధిస్తుంటే, హీరో హీరోయిన్లుగా నటించిన టైగర్, కృతి సనన్('1.. నేనొక్కడినే' ఫేమ్)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా టైగర్ నటన, అతని డాన్సులు, ఫైట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.