Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అడివి శేష్ సినిమాను భారీ ధరకు అమ్మేసిన మహేష్ బాబు.. సాలీడ్ డీల్
సెకండ్ వేవ్ అనంతరం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల లిస్టు అంతకంతకు పెరుగుతూనే ఉంది. బంగారం లాంటి సమ్మర్ టైమ్ మొత్తం వృధా అయ్యింది. పెద్ద సినిమాలు మళ్ళీ కొత్త డేట్స్ కోసం ఎగబడే ఆసన్నమైంది. అయితే సినిమా రిలీజ్ డేట్స్ మళ్ళీ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పటికీ ఇతర బిజినెస్ డీల్స్ మాత్రం వెంటవెంటనే క్లోజ్ అవుతున్నాయి. ఇటీవల మహేష్ బాబు తన ప్రొడక్షన్ లో రూపొందించిన సినిమా శాటిలైట్ హక్కులను కూడా మంచి ధరకు అమ్మేసినట్లు సమాచారం.
మొదటిసారి బయట హీరోతో
మహేష్ బాబుకు సొంతంగా GMB ప్రొడక్షన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి కూడా ఆ బ్యానర్ ను తన సినిమాలలో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తున్న మహేష్ మొదటిసారి బయట హీరోతో వర్క్ చేయిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అడివి శేష్ తో మేజర్ అనే సినిమాను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే.
మంచి బజ్ క్రియేట్ చేశాయి
మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ లో కూడా సినిమా భారీగా రిలీజ్ కానుంది.
భారీ ఆఫర్
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే కొనసాగుతున్నట్లు సమాచారం. మేజర్ హిందీ శాటిలైట్ రైట్స్ ను ఒక ప్రముఖ ఛానెల్ 10కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక మహేష్ బాబుతో పాటు సోని పిక్చర్స్ కూడా సినిమా నిర్మాణంలో పాట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే.
రిలీజ్ ఎప్పుడంటే..?
ఇక సినిమా రిలీజ్ డేట్ పై మరోసారి కన్ఫ్యూజన్ నెలకొంది. అసలైతే ఈ ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వలన ప్లాన్స్ తారుమారయ్యాయి. వీలైనంత వరకు థర్డ్ వేవ్ ఉండకపోతేనే సినిమాను త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి వారి ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో శోభిత ధూళిపాల హీరోయిన్ గా నటిస్తుండగా సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.