Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ హాలీవుడ్ డబ్బింగ్ ఇండియాలో 600 ప్రింట్లుతో
దాదాపు రూ.2500 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమయిన 'అవతార్' సినిమా డిసెంబరు 18న మన దేశంలో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రాన్ని టైటానిక్ వంటి అధ్బుతమైన చిత్రం చేసిన జేమ్స్ కెమెరన్ దర్శకుడవటంతో మంచి క్రేజ్ వచ్చింది. అలాగే మరో విశేషం ఏమిటంటే మనదేశంలో దాదాపు 600 పైచిలుకు ప్రింట్లతో దీన్ని విడుదల చేస్తున్నారు. అందులో 40 శాతం హిందీ ప్రింట్లు..24 శాతం తెలుగు..తమిళం ప్రింట్లు.
ఫిక్షన్ కథతో రూపొందిన ఈ చిత్రం కథ విషయానికి వస్తే జాక్ అనే ఓ నావికుడు ఓ పోరాటంలో గాయపడి నడవలేని స్థితిలో వుంటాడు. తాను నడవడానికి అవకాశం వుంటుందని తెలిసి అవతార్ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి పాండార్ అనే ఓ అడవికి చేరతాడు. పాండార్ నావీ అనే ఏలియన్ ను పోలిన వింత జీవులు నివాస స్థలం కూడా. పది అడుగుల ఎత్తు, ఓ తోక, నీలం రంగులో మెరిసే చర్మంతో వీరంతా వింతగా వుంటారు. తమ నివాస స్థలాన్ని మనుషులు ఆక్రమించుకుంటున్నారని వారు పోరాటం మొదలు పెడతారు.
ఈ పోరాటంలో జాక్ కూడా పాలుపంచుకోవాల్సి వస్తుంది. అంతే కాకుండా జాక్ ఓ నావీని ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరుగుతుంతో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 3-D పరిజ్ఞానంతో రూపొందిన ఈ సినిమా కోసం హాలీవుడ్ మొత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.దాదాపు 60 శాతం కంప్యూటర్ గ్రాఫిక్స్,40 శాతం లైవ్ యాక్షన్ ల సమాహారంతో ఈ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లో ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఠాగూర్ మధు ద్వారా రానున్నది.
మధు ఈ చిత్రం రైట్స్ మంచి పోటీలో తీసుకున్నారు. డిసెంబర్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నామనీ మధు తెలిపారు.ఠాగూర్ చిత్రం తర్వాత అల్లు అరవింద్ తో కలిసి హిందీ 'గజనీ' చిత్రాన్ని మధు నిర్మించారు. ఇటీవలే రైట్స్ తీసుకుని 'మహాత్మ' చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా రిలీజ్ చేశారు.