Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఇద్దరమ్మాయిలతో' ఆడియో రైట్స్ ఎవరికంటే...
హైదరాబాద్: అల్లు అర్జున్-ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ఈ చిత్రం ఆడియో రైట్స్ ని ఆదిత్యా మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. చాలా పోటీలో ఈ ఆడియోని వారు సొంతం చేసుకున్నట్లు...ఇందునిమిత్తం పెద్ద మొత్తాన్నే వెచ్చించినట్లు సమాచారం.
మరో ప్రక్క 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం విడుదల తేదీని మే 24 కి షిప్ట్ చేసారు. మొదట మే 10న విడుదల చేయనున్నామని గతంలో ప్రకటించారు. కానీ ప్రొడక్షన్ వైపు నుంచి చేయాల్సినవి ఇంకాస్త మిగిలి వుందని విడుదల తేదీని వెనక్కు జరిపారు. అలాగే ఆడియో విడుదల కార్యక్రమం కూడా ఏప్రిల్ 21న జరగటం లేదు. ఇది కూడా వాయిదా పడ్డట్టే అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఇంకా ప్రకటించాల్సి వుంది.
ఇటీవల రిలీజ్ చేసిన సినిమా టీజర్కు విపరీతమైన స్పందన వస్తోంది. ట్రైలర్ సంగతి ఇక చెప్పక్కర్లేదు. యు-ట్యూబ్లో రికార్డుస్థాయిలో 'ఇద్దరమ్మాయిలతో' ట్రైలర్స్కు అత్యధిక హిట్స్ లభించాయని నిర్మాతలు చెప్తున్నారు. అల్లు అర్జున్, అమలాపాల్, కాథెరీనా ఇందులో ప్రధాన తారాగణం. లవ్ తో కూడిన యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశమిది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ బాణీలు కూర్చారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే థాయిలాండ్, స్పెయిన్ దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది.
ఇందులో థాయ్ ఫైట్ మాస్టర్ కేచ కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి. ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసాడట కెచె. ఇందుకుగాను అతనికి నిర్మాత బండ్ల గణేష్ భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చాడని టాక్. ఈ చిత్రానికి నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్,ఛాయాగ్రహణం: అమోల్ రాథోడ్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.