Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
అల్లు అర్జున్ చిత్రానకి భారీ ఆఫర్(ట్రేడ్ టాక్)
హైదరాబాద్ : దేశముదురు తర్వాత బన్నీ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. .లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై బన్ని అభిమానుల్లోనే కాక మిగతా వారిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దాంతో ట్రేడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ఓ రేంజిలో అమ్ముడైనట్లు సమాచారం.
ఓవర్ సీస్ లో ప్రముఖ పంపిణీ సంస్ధ బ్లూ స్కై వారు ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. మూడు కోట్ల వరకూ ఈ చిత్రం రైట్స్ పలికినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ చిత్రాల్లో ఇది మంచి రేటే. అమలాపాల్, కేథరిన్ హీరోయిన్స్వాటిని మరింత పెంచుతూ...రిలీజైన ట్రైలర్ ఆదరణ పొందింది.
పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..అల్లరి... ఆలోచన - ఆ అబ్బాయి ప్రత్యేకతలు. దుమ్ము రేపే జోరుంది. నిజం మాట్లాడతాడు. నిక్కచ్చిగా ఉంటాడు. అతని ఫిలాసఫీ కూడా కొత్తగా ఉంటుంది. 'చుట్టూ ఎవరూ లేనప్పుడు నువ్వేంటో.. అదే నువ్వు..' అంటూ హితోపదేశం చేస్తాడు. అతను ఇద్దరమ్మాయిలతో సాగించిన ప్రయాణం ఎలాంటిదో మా సినిమా చూసి తెలుసుకోవల్సిందే అంటున్నారు పూరి జగన్నాథ్.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ''చాలా కాలం తరవాత పూరి ఓ ప్రేమకథ తెరకెక్కిస్తున్నారు. ఆ ప్రేమాయణాన్ని చూపించే విధానం అందర్నీ అలరిస్తుంది. అల్లు అర్జున్ నటన, ఆయన కాస్ట్యూమ్స్ కొత్తగా ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్కి మంచి స్పందన వచ్చింది. నెట్లో లక్షల మంది చూశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు యువతరాన్ని ఆకట్టుకొంటాయి''అన్నారు.
ఇక ఈ చిత్రాన్ని మే 24న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆడియోని వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆడియోని ఏప్రియల్ 28న విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇంతకుముందు 21 ఏప్రియల్ ఆడియో తేదీని విడుదల చేసారు. అది ఫోన్స్ ఫోన్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.
స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.