Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Itlu Maredumilli Prajaneekam: సండే షాకింగ్ కలెక్షన్లు.. నరేష్కు బిగ్ షాక్.. ఇలా అయితే హిట్ కష్టమే!
బడా డైరెక్టర్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కామెడీ హీరోగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్. అంతేకాదు, హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇప్పటికే యాభైకి పైగా చిత్రాల్లో నటించి సత్తా చాటుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో కామెడీ చిత్రాలను తగ్గించిన అతడు.. వైవిధ్యమైన కథలతో వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాతో వచ్చాడు. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా వసూళ్లు పెద్దగా రావట్లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ మూడు రోజుల రిపోర్టును చూద్దాం పదండి!
మారేడుమిల్లికి వచ్చిన నరేష్
కామెడీ హీరోగా పేరొందిన అల్లరి నరేష్ నటించిన విలక్షణ చిత్రమే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ తెరకెక్కించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించారు. ఇందులో ఆనంది హీరోయిన్గా నటించింది. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు. ఇందులో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ సహా కొందరు కీలక పాత్రల్లో కనిపించారు.
Bigg Boss Nominations: 13వ వారం నామినేషన్ లిస్ట్ లీక్.. ఆ ఇద్దరు తప్ప అంతా.. వాళ్ల మధ్య భీకర ఫైట్
నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్
అల్లరి నరేష్కు ఆంధ్రా, తెలంగాణలో మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను అన్ని ఏరియాల్లోనూ అత్యధిక థియేటర్లలో ప్రేక్షఖుల ముందుకు తెచ్చారు.
3వ రోజు ఎంత వచ్చిందంటే?
అల్లరి నరేష్ నటించిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి టాక్కు అనుగుణంగా కలెక్షన్లు రావడం లేదు. ఇలా మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 90 లక్షలు గ్రాస్, రెండో రోజు రూ. 81 లక్షలు గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. ఆదివారం అయిన మూడో రోజు ఊహించని విధంగా రూ. 70 లక్షలు గ్రాస్ను సొంతం చేసుకుంది. దీంతో దీనికి రూ. 35 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.
Bigg Boss Winner: ఆరో సీజన్ విజేత ఆ కంటెస్టెంటే.. పేరు లీక్ చేసిన మెగాస్టార్.. నాగార్జున అసంతృప్తి
3 రోజులకూ ఎంత వచ్చింది?
అల్లరి నరేష్ నటించిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ వీకెండ్లో నిరాశ పరిచే వసూళ్లనే రాబట్టిందని చెప్పొచ్చు. ఏరియాల పరంగా చూస్తే.. 3 రోజుల్లో ఇది నైజాంలో రూ. 94 లక్షలు, సీడెడ్లో రూ. 21 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.25 కోట్లు గ్రాస్ను రాబట్టింది. ఇలా 3 రోజుల్లో ఈ మూవీ రూ. 2.40 కోట్లు గ్రాస్, రూ. 1.28 కోట్లు షేర్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 2.40 కోట్లు గ్రాస్ను రాబట్టిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 14 లక్షలు వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 2.54 కోట్లు గ్రాస్తో పాటు రూ. 1.35 కోట్లు షేర్ను వచ్చింది.
బ్రా కూడా లేకుండా కరీనా రచ్చ: తల్లైనా తెగించేసిన హీరోయిన్
టార్గెట్కు ఇంకెంత రావాలి?
అల్లరి నరేష్ 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 రోజుల్లో రూ. 1.35 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.65 కోట్లు షేర్ను రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది.
ఇదే జరిగితే హిట్ కష్టమేనా
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి ఆశించిన రీతిలో కలెక్షన్లు రావడం లేదు. దీంతో ఫస్ట్ వీకెండ్లోనే దీనికి చాలా తక్కువ వసూళ్లు దక్కాయి. ఇక, వీక్ డేస్లో ఇది మరింతగా డౌన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చేరుకోవడం కష్టమే అనాలి.