Don't Miss!
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Jathi Ratnalu day 2 collections: ట్రేడ్ వర్గాలకే షాకిస్తోన్న జాతి రత్నాలు.. రెండు రోజులకే అంతా!
ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. చిన్న సినిమానా? పెద్దదా? అనే చూడకుండా.. కంటెంట్ బాగుంటే చాలు ఆదరిస్తాం అన్నట్లుగా స్పందిస్తున్నారు ఇక్కడి ఆడియెన్స్. అందుకే గతంతో పోల్చుకుంటే ఇటీవల ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చిన్న సినిమాగా వచ్చినా.. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న చిత్రాల్లో 'జాతి రత్నాలు' ఒకటి. శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇక, ఈ మూవీ రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!
టాలీవుడ్లో ‘జాతి రత్నాలు' అనిపించుకునేలా
'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' వంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం ద్వారా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
తెలుగులో తొలిసారి అలా... షో పేరూ వాడారు
ఏ సినిమా అయినా జనాల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీనే ముఖ్యం. ఇందులో 'జాతి రత్నాలు' టీమ్ చాలా వైవిధ్యాన్ని ప్రదర్శించింది. మరీ ముఖ్యంగా వినూత్నమైన ప్రమోషన్తో ప్రేక్షకులకు చేరువ అయింది. చివరికి సుమ షో 'క్యాష్'ను కూడా వాడుకుని మరీ సినిమాను హైలైట్ చేశారు. తద్వారా ఈ చిత్రానికి విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే.
షాకింగ్గా బిజినెస్.. ఎక్కడ? ఎంత? జరిగింది?
పోస్టర్లు, టీజర్, ట్రైలర్ల కారణంగా 'జాతి రత్నాలు'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
రెండో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
రెండో
రోజు
కూడా
'జాతి
రత్నాలు'కు
భారీగానే
రెస్పాన్స్
వచ్చింది.
ఫలితంగా
నైజాంలో
రూ.
1.16
కోట్లు,
సీడెడ్లో
రూ.
31
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
34
లక్షలు,
ఈస్ట్లో
రూ.
21
లక్షలు,
వెస్ట్లో
రూ.
21
లక్షలు,
గుంటూరులో
రూ.
24
లక్షలు,
కృష్ణాలో
రూ.
21
లక్షలు,
నెల్లూరులో
రూ.
12
లక్షలతో
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణలో
కలిపి
రూ.
2.80
కోట్లు
షేర్,
రూ.
4.80
కోట్లు
గ్రాస్
వచ్చింది.
రెండు రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?
మొదటి రోజే మంచి టాక్తో సత్తా చాటిన 'జాతి రత్నాలు' తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ను అందుకుంది. ఫలితంగా మొదటి రోజు రూ. 3.94 కోట్లు వసూలు చేసింది. ఇక, రెండో రోజు కూడా ఆడియెన్స్ను రాబట్టడంలో సక్సెస్ అయిన ఈ చిత్రం రూ. 2.80 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే రూ. 6.74 కోట్లు షేర్, రూ. 11.35 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో కలిపి రూ. 6.74 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్లో రూ. 1.55 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.59 కోట్లు షేర్తో పాటు రూ. 14.20 కోట్లు గ్రాస్ను కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడంతో ట్రేడ్ వర్గాలే షాకైపోతున్నాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత వస్తే హిట్?
ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజులకు రూ. 8.59 కోట్లు కోట్లు వసూలు అవడంతో టార్గెట్ చేరుకోవాలంటే ఇంకా రూ. 2.91 కోట్లు వసూలు చేయాలి. ఈ ఊపును బట్టి చూస్తే ఆదివారం కల్లా అది ఫినీష్ అయ్యే అవకాశం ఉంది.