Don't Miss!
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షాక్ ఇస్తున్న జాతిరత్నాలు ప్రీ రిలీజ్ బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ పెద్దదే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుకు తరువాత సినిమాల హడావుడి గట్టిగానే కనిపిస్తోంది. డిఫరెంట్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఏడాది పాటు కొత్త సినిమాలు లేక వినోదానికి దూరమైన ఆడియెన్స్ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మార్చ్ 11న రానున్న జాతిరత్నాలు అలాంటి ఆడియెన్స్ కోసమే వస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా హాట్ టాపిక్ గా మారింది.
కాంబినేషన్ తోనే అంచనాలు పెంచేశారు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న టాలెంటెడ్ యువ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా చేస్తున్న సెకండ్ మూవీ జాతి రత్నాలు. ప్రస్తుతం జనరేషన్స్ లో అమితంగా ఆకట్టుకుంటున్న కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కూడా సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ కాంబినేషన్ తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
వైరల్ అయిన టీజర్, సాంగ్స్
సినిమాను వైజయంతి వారి స్వప్నా సినిమాస్ లో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. పిట్టగొడ దర్శకుడు అనుదీప్ సినిమాకు దర్శకత్వం వహించగా రాధన్ మ్యూజిక్ అంధించాడు. ఇప్పటికే చిట్టి అనే సాంగ్ యూ ట్యూబ్ లో బాగా వైరల్ అయ్యింది. ఇక టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Recommended Video
ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న ప్రభాస్
జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా మార్చ్ 4న సాయంత్రం 4:20గంటలకు రిలీజ్ చేయించనున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తో ఉన్న సాన్నిహిత్యం ద్వారా నాగ్ అశ్విన్ ఇటీవల ప్రభాస్ ను కలిసి జాతిరత్నాలు సినిమా గురించి చెప్పినట్లు సమాచారం.
బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..
ఇక ఈ సినిమా చిన్న బడ్జెట్ తోనే నిర్మించారని తెలుస్తోంది. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో మాత్రం షాక్ ఇచ్చే నెంబర్లు వైరల్ అవుతున్నాయి. 12 నుంచి 15కోట్ల మధ్య సినిమా బిజినెస్ చేసే ఛాన్స్ ఉందట. ఇక సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ లోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేవచ్చని సమాచారం. సినిమా 14కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.