Don't Miss!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చెన్నైలో కబీర్ సింగ్ హవా.. తమిళ చిత్రాలను వెనుకకు నెట్టి..
బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.70 కోట్లు వసూలు చేసింది. అర్జున్ రెడ్డి చిత్రం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం షాహీద్ కపూర్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఈ చిత్రం మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్నది. గతంలో టోటల్ ఢమాల్ సాధించిన వసూళ్లను అధిగమించింది.
ఇదిలా ఉండగా, కబీర్ సింగ్ చిత్రానికి చెన్నైలో మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. తమిళ చిత్రాల కంటే ముందు వరుసలో నిలువడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ వారంలో కబీర్ సింగ్ టాప్ కలెక్షన్లు సాధించగా, రెండో స్థానంలో టాయ్ స్టోరి, మూడో స్థానంలో గేమ్ ఓవర్, 4 సథానంలో ఫకీర్, ఐదో స్థానంలో తుంబా చిత్రాలు నిలిచాయి.'
తమిళనాడులో ఈ వారం విజయ్ సేతుపతి నటించిన సింధ్బాద్ చిత్రం రిలీజ్ కావాల్సింది. అయితే బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని ఆ చిత్రంపై స్టే విధించడంతో రిలీజ్ వాయిదా పడింది. దాంతో కబీర్ సింగ్ చిత్రానికి కలిసి వచ్చింది. యూత్ను విశేషంగా ఆకర్షిస్తుండటంతో టాప్ రేంజ్కు చేరుకొన్నది.
అర్జున్ రెడ్డి చిత్రం ఆధారంగా తమిళంలో రూపొందిన వర్మ చిత్రం ఆలస్యం కావడం కూడా కబీర్ సింగ్కు కలిసి వచ్చింది. విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్న చిత్రం వర్మ చిత్రం త్వరలోనే విడుదల కానున్నది. ఇప్పటికే వర్మ చిత్రం విడుదల కావాల్సింది. కానీ దర్శకుడు బాలాతో విభేదాల కారణంగా ఈ చిత్రం మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది.