Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
'కిక్-2' విడుదల తేదీ ప్రకటించిన కల్యాణ్ రామ్
హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 21న 'కిక్-2'ను విడుదల చేయనున్నట్లు కల్యాణ్రామ్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. అది ఇక్కడ చూడండి.
I can 'comfort'ably announce that Kick 2 will release on August 21st Download our #Kick2 App NowApple iOS: http://t.co/fotzApaykoAndroid: http://t.co/asCWHeoEz9
Posted by Nandamuri Kalyanram on 30 July 2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ స్వరాలు అందించారు. తాజా చిత్రంలో రవితేజ, రకుల్ప్రీత్ సింగ్, రవికిషన్ కీలక పాత్రధారులు. గతంలో మంచి 'కిక్' ఇచ్చిన సినిమాకు సీక్వెల్గా వస్తున్న చిత్రం 'కిక్-2' కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్'కు సీక్వెల్ కాదు. కానీ అందరికీ డబుల్ కిక్ ఇస్తుంది. ‘కిక్'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్-2'. రాజస్థాన్లోని జైసల్మీర్లో క్లైమాక్స్ను భారీగా తెరకెక్కించాం. '' అని తెలిపారు.
చిత్రం ట్రైలర్ ఇక్కడ చూడండి...
నందమూరి కల్యాణ్రామ్ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్ తర్వాత సురేందర్రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్ వేల్యూస్తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. ఆగస్టు 21 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్టైనర్తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్.యస్.థమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్.