Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తీవ్ర పోటీలో దిగిన కార్తీ.. మొదటి రోజు ‘దొంగ’ ఎంత దోచాడంటే?
కార్తీ తమిళ నటుడే అయినా.. తెలుగు హీరోగానే గుర్తించారు ఇక్కడి ప్రేక్షకులు. మొదటి చిత్రం నుంచే విలక్షణ నటుడిగా నిరూపించుకున్న కార్తీ ఆవారా, నా పేరు శివ, ఊపిరి లాంటి చిత్రాలతో టాలీవుడ్కు మరింత దగ్గరయ్యాడు. ఈ మధ్య వచ్చిన ఖైదీ చిత్రంతో అందర్నీ మెప్పించిన కార్తీ.. మరోసారి దొంగగా పలకరించబోతోన్నాడు. మరి ఈ చిత్రం మొదటి రోజు ఏ మేరకు ఆడిందో ఓ సారి చూద్దాం.
ఖైదీతో వంద కోట్ల హీరో..
ఖైదీ సినిమా అనూహ్య విజయాన్ని సాధించిడంతో కార్తీ క్రేజ్ అమాంతం పెరిగింది. తొలిసారి వంద కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన కార్తీ.. ఫుల్ జోష్ మీదున్నాడు. అందుకే ఆ చిత్రం వచ్చి నెలరోజుల్లోనే మరోసారి దొంగగా పలకరించాడు. అయితే ఖైదీ అంతటి విజయాన్ని సాధించడటానికి ఎన్నో కారణాలున్నాయి.
ఒంటరిగా బరిలోకి..
ఖైదీ తెలుగులో డబ్ అయిన చిత్రమే అయినా.. పెద్ద మొత్తంలో థియేటర్లను కేటాయించారు. విజిల్, ఖైదీ రెండు డబ్బింగ్ చిత్రాలే అయినా దాదాపు ఒక్కో సినిమాకు ఆరు వందల థియేటర్లను కట్టబెట్టారు. అప్పుడు తెలుగు సినిమాలేవీ విడుదల కాకపోవడం ఖైదీకి కలిసి వచ్చింది. అందుకే ఆ వారం మొత్తం ఖైదీ హవా సాగింది.
తీవ్రమైన పోటీలో..
అయితే దొంగ వచ్చిన సమయం కరెక్ట్ కాదు. ప్రతిరోజూ పండగే, రూలర్ లాంటి పెద్ద చిత్రాలు రేసులో ఉండగా..వాటికే సరైన మొత్తంలో థియేటర్లను కేటాయించలేరు. అలాంటిది డబ్బింగ్ రూపంలో వస్తోన్న దొంగకు ఎలా ఇస్తారు. దీంతో దొంగపై భారీగానే దెబ్బ పడింది. ఈ చిత్రానికి మొత్తంగా ఓ వంద థియేటర్లు ఇచ్చి ఉంటారని తెలుస్తోంది.
ప్రభావం చూపని దొంగ..
ఈ చిత్రం బాగుందని మౌత్ టాక్ వచ్చినా.. థియేటర్ల సమస్య ఇబ్బంది పెట్టవచ్చు. ఈ చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 20-25లక్షలు వసూళు చేసే అవకాశముందని తెలుస్తోంది. మంచి అంచనాలున్న ఈ చిత్రం రూలర్, ప్రతిరోజూ పండగే పై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది.
బిజినెస్ జరిగిన తీరు..
ఖైదీ తరువాత వస్తోన్న చిత్రం.. దృశ్యం లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రావడం ఇలా అన్ని అంశాలు కుదరడంతో తెలుగులో దాదాపు 3.5కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మరి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే లాంగ్ రన్లో కనీసం నాలుగు కోట్లైనా కొల్లగొట్టాల్సి ఉంటుంది.