Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తీవ్ర పోటీలో దిగిన కార్తీ.. మొదటి రోజు ‘దొంగ’ ఎంత దోచాడంటే?
కార్తీ తమిళ నటుడే అయినా.. తెలుగు హీరోగానే గుర్తించారు ఇక్కడి ప్రేక్షకులు. మొదటి చిత్రం నుంచే విలక్షణ నటుడిగా నిరూపించుకున్న కార్తీ ఆవారా, నా పేరు శివ, ఊపిరి లాంటి చిత్రాలతో టాలీవుడ్కు మరింత దగ్గరయ్యాడు. ఈ మధ్య వచ్చిన ఖైదీ చిత్రంతో అందర్నీ మెప్పించిన కార్తీ.. మరోసారి దొంగగా పలకరించబోతోన్నాడు. మరి ఈ చిత్రం మొదటి రోజు ఏ మేరకు ఆడిందో ఓ సారి చూద్దాం.
ఖైదీతో వంద కోట్ల హీరో..
ఖైదీ సినిమా అనూహ్య విజయాన్ని సాధించిడంతో కార్తీ క్రేజ్ అమాంతం పెరిగింది. తొలిసారి వంద కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన కార్తీ.. ఫుల్ జోష్ మీదున్నాడు. అందుకే ఆ చిత్రం వచ్చి నెలరోజుల్లోనే మరోసారి దొంగగా పలకరించాడు. అయితే ఖైదీ అంతటి విజయాన్ని సాధించడటానికి ఎన్నో కారణాలున్నాయి.
ఒంటరిగా బరిలోకి..
ఖైదీ తెలుగులో డబ్ అయిన చిత్రమే అయినా.. పెద్ద మొత్తంలో థియేటర్లను కేటాయించారు. విజిల్, ఖైదీ రెండు డబ్బింగ్ చిత్రాలే అయినా దాదాపు ఒక్కో సినిమాకు ఆరు వందల థియేటర్లను కట్టబెట్టారు. అప్పుడు తెలుగు సినిమాలేవీ విడుదల కాకపోవడం ఖైదీకి కలిసి వచ్చింది. అందుకే ఆ వారం మొత్తం ఖైదీ హవా సాగింది.
తీవ్రమైన పోటీలో..
అయితే దొంగ వచ్చిన సమయం కరెక్ట్ కాదు. ప్రతిరోజూ పండగే, రూలర్ లాంటి పెద్ద చిత్రాలు రేసులో ఉండగా..వాటికే సరైన మొత్తంలో థియేటర్లను కేటాయించలేరు. అలాంటిది డబ్బింగ్ రూపంలో వస్తోన్న దొంగకు ఎలా ఇస్తారు. దీంతో దొంగపై భారీగానే దెబ్బ పడింది. ఈ చిత్రానికి మొత్తంగా ఓ వంద థియేటర్లు ఇచ్చి ఉంటారని తెలుస్తోంది.
ప్రభావం చూపని దొంగ..
ఈ చిత్రం బాగుందని మౌత్ టాక్ వచ్చినా.. థియేటర్ల సమస్య ఇబ్బంది పెట్టవచ్చు. ఈ చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 20-25లక్షలు వసూళు చేసే అవకాశముందని తెలుస్తోంది. మంచి అంచనాలున్న ఈ చిత్రం రూలర్, ప్రతిరోజూ పండగే పై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది.
బిజినెస్ జరిగిన తీరు..
ఖైదీ తరువాత వస్తోన్న చిత్రం.. దృశ్యం లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రావడం ఇలా అన్ని అంశాలు కుదరడంతో తెలుగులో దాదాపు 3.5కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మరి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే లాంగ్ రన్లో కనీసం నాలుగు కోట్లైనా కొల్లగొట్టాల్సి ఉంటుంది.