Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘కేసరి’ కలెక్షన్స్, రూ. 100 కోట్ల దిశగా..
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ 'కేసరి' సినిమాతో మరోసారి బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. ఆయన నటించిన ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దుమ్ము రేపుతోంది. తొలి మూడు రోజుల్లోనే (శనివారం వరకు) రూ. 50 కోట్లు రాబట్టిన ఈ చిత్రానికి ఆదివారం కలెక్షన్స్ మరింత స్ట్రాంగ్గా నమోదయ్యాయి.
తొలిరోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్ రావడం, క్రిటిక్స్ నుంచి కూడా మంచి రేటింగ్ రావడంతో ఈ చిత్రంపై ఆడియన్స్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. హోళీ హాలిడే సందర్బంగా విడుదల కావడంతో రూ. 21.06 కోట్లు వసూలు చేసి 2019లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది.
మూడు రోజుల్లో రూ. 50 కోట్లు
సెలవురోజైన హోళితో పోలిస్తే శుక్రవారం మూవీ వసూళ్లు కాస్త తగ్గి రూ. 16.70 కోట్లు వసూలు చేసింది. అయితే శనివారం పుంజుకుని రూ. 18.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 3 రోజుల్లో రూ. 50 కోట్ల మార్కును అధిగమించింది.
ఆదివారం అదరగొట్టింది, 100 కోట్ల దిశగా...
ఆదివారం ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులు రావడంతో ‘కేసరి' కలెక్షన్స్ ఎగసి పడ్డారు. ఇండియా వ్యాప్తంగా దాదాపు రూ. 21 కోట్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో ఫస్ట్ వీకెండ్ వసూల్లు దాదాపు రూ. 75 కోట్లను రీచ్ అయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం.
భారీగా అడ్వాన్స్ బుకింగ్
బాక్సాఫీసు బరిలో ఇతర పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడం కూడా ఈ చిత్రానికి కలిసి వస్తోంది. భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోంది. సౌతిండియాలోని మెట్రోసిటీల్లో సైతం వసూళ్లు సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి.
కేసరి
అక్షయ్ కుమార్ సరసన పరిణీతి చోప్రా నటించింది. మీర్ సర్వర్, వనుష్ భరద్వాజ్, జస్పీత్ సింగ్, వివేక్ సైనీ, విక్రమ్ కొచ్చర్ ముఖ్య పాత్రల్లో నటించారు. 1897లో సారాగర్హి వద్ద 21 మంది సిక్కు సోల్జర్స్ 10వేల మంది ఆప్ఘనిస్థాన్ ఆక్రమణదారులపై ఎలా పోరాడారు అనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం.