Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
మహేశ్ బాబు థియేటర్లో నాగ చైతన్య రికార్డు: అక్కడ ‘లవ్ స్టోరి’ ఎంత వసూలు చేసిందో తెలిస్తే!
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్ స్టోరి'. వరుణ్ తేజ్తో 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. కానీ, కరోనా ప్రభావం కారణంగా థియేటర్లు మూతపడడంతో దీన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 24 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 'లవ్ స్టోరి' మూవీకి ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అదే కంటిన్యూ చేస్తూ ఇది చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్లోనూ మంచి స్పందనను అందుకుంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు కూడా అదిరిపోయేలా వచ్చాయి. దీంతో చాలా తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను కూడా చేరుకుంది. అంతేకాదు, దీని వల్ల నిర్మాతలకు లాభాలు కూడా దక్కాయి. ఇక, ఇప్పటికీ ఈ మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లలో మంచి స్పందనే దక్కుతుండడం విశేషం.
సున్నితమైన ప్రేమకథతో రూపొందిన 'లవ్ స్టోరి' మూవీ గురించి తాజాగా టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎమ్బీ సినిమాస్ ఓ అదిరిపోయే న్యూస్ చెప్పింది. తాజాగా సదరు థియేటర్ యాజమాన్యం సోషల్ మీడియాలో 'లవ్ స్టోరి అనే సినిమా సక్సెస్ స్టోరీగా అయిపోయింది. మా థియేటర్లో ఈ సినిమాకు సంబంధించి మొత్తం 251 షోలు వేశాము. అందులో 48233 మంది ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించారు. దీంతో మా థియేటర్కు కోటి రూపాయల గ్రాస్ వసూలైంది. దీనిపై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలుపుతున్నాము' అంటూ పోస్ట్ చేశారు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!
థియేటర్లలో సత్తా చాటిన నాగ చైతన్య.. సాయి పల్లవి 'లవ్ స్టోరి' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు కూడా సమయం దగ్గర పడింది. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను అక్టోబర్ 22 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించన ప్రకటనను కూడా సదరు సంస్థ వెల్లడించింది. అదే సమయంలో ఓ ప్రత్యేకమైన ట్రైలర్ను కూడా విడుదల చేసింది. దీంతో ఓటీటీ అభిమానులు ఈ చిత్రం కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 'లవ్ స్టోరీ'లో మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తూనే ఉంది. దసరా సీజన్లో కొన్ని కొత్త సినిమాలు ఉన్నప్పటికీ ఇది మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇక, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.