Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
200 రోజుల కలెక్షన్ రికార్డ్... కేవలం 24 రోజుల్లో ఢమాల్, ఇపుడు ఇదే టాప్!
మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన 'లూసిఫెర్' మూవీ కేరళ బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికే రూ. 150 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం... అత్యంత వేగంగా ఇంత భారీ మొత్తం వసూలు చేసిన మలయాళ చిత్రంగా రికార్డ్ సొంతం చేసుకుంది.
ఇప్పటికే కేరళలో పలు రికార్డులను బద్దలు కొట్టిన 'లూసిఫెర్'.. తమిళనాడులో కూడా సత్తా చాటుతోంది. అక్కడ బిగ్గెస్ట్ మాలీవుడ్ గ్రాసర్గా సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటి వరకు తమిళనాడులో 'ప్రేమమ్' టాప్ పొజిషన్లో ఉండగా... తాజాగా 'లూసిఫెర్' దాన్ని వెనక్కి నెట్టింది.
200 రోజుల కలెక్షన్ రికార్డ్.. కేవలం 24 రోజుల్లో ఢమాల్
‘లూసిఫెర్' రిలీజ్ ముందు వరకు తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం నవీన్ పాలీ, సాయి పల్లవి నటించిన ‘ప్రేమమ్'. అక్కడ ఈ చిత్రం దాదాపు 200 రోజులు రన్ అవ్వడంతో పాటు రూ. 2 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ రికార్డును ‘లూసిఫెర్' కేవలం 24 రోజుల్లోనే రీచ్ అవ్వడం గమానార్హం.
రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్
‘లూసిఫెర్' చిత్రంపై ప్రీ రిలీజ్ హైప్ బాగా ఉండటంతో అన్ని ఏరియాల్లో రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ సాధించింది. ఒక్క కేరళలోనే ఫస్ట్ డే రూ. 6.7 కోట్లు రాబట్టి.... ‘ఒడియన్' (రూ. 7.2 కోట్లు) తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. తొలి వారాంతం కేరళ వ్యాప్తంగా రూ. 17.50 కోట్ల గ్రాస్ రాబట్టగా, వరల్డ్ వైడ్ రూ. 44 కోట్లు వసూలు చేసింది.
ఇప్పటికీ తగ్గని డిమాండ్
‘లూసిఫెర్' విడుదలై మూడు వారాలు గడిచినా... డిమాండ్ తగ్గలేదు. త్వరలోనేఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆల్ టైమ్ మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పులిమురుగన్' రూ. 160 కోట్ల రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
సీక్వెల్ తీయాలంటున్న ఫ్యాన్స్
‘లూసిఫెర్' మూవీ బాగా నచ్చడంతో కొందరు అభిమానులు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని కోరుతున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్గా పని చేసిన మురళి గోపీ కూడా సీక్వెల్ సాధ్యమే అని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ నుంచి కూడా అదే డిమాండ్ వస్తుండటంతో త్వరలో ఇది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
లూసిఫెర్
లూసిఫెర్ చిత్రం ద్వారా మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకుడిగా మారాడు. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో మోహన్ లాల్తో పాటు వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, టోవినో థామస్, కళాభవన్ షాజోన్, సాయికుమార్, బైజు సతోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.