twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంతకు అమ్మారంటే...

    By Srikanya
    |

    రామ్ చరణ్ తాజా చిత్రం "ఆరెంజ్" శాటిలైట్ రైట్స్ ని మాటీవీ వారు తీసుకున్నారు. రైట్స్ కోసం వారు ఆరున్నర కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్తున్నారు. నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా మగధీర తర్వాత విడుదల అయిన ఈ చిత్రంపై క్రేజ్ ఇప్పటికీ ఉండటంతో ఆ మొత్తం చెల్లించారంటున్నారు. అయితే చిరంజీవి వాటా ఉన్న ఛానెల్ కాబట్టి ఆ రేంజి మొత్తం ఇచ్చి ఆరెంజ్ రైట్స్ ని తీసుకున్నారని ఓ వర్గం అంటోంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో నాగబాబు ఈ చిత్రాన్ని దాదాపు 32 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు. అయితే రిలీజైన మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకోవటం మైనస్ గా మారింది. తర్వాత గ్రాడ్యువల్ గా కలెక్షన్స్ డ్రాప్ అవటం ప్రారంభించాయి. హీరో రామ్ చరణ్ మాత్రం నాలుగైదు రోజులు ఈ చిత్రం జనాల్లోకి పోవటానికి పడుతుందని, ఆ తర్వాత విజయం సాధించటం తధ్యమని హామీ ఇచ్చాడు కానీ ఆ మాట నిజం కాలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X