Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంతకు అమ్మారంటే...
రామ్ చరణ్ తాజా చిత్రం "ఆరెంజ్" శాటిలైట్ రైట్స్ ని మాటీవీ వారు తీసుకున్నారు. రైట్స్ కోసం వారు ఆరున్నర కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్తున్నారు. నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా మగధీర తర్వాత విడుదల అయిన ఈ చిత్రంపై క్రేజ్ ఇప్పటికీ ఉండటంతో ఆ మొత్తం చెల్లించారంటున్నారు. అయితే చిరంజీవి వాటా ఉన్న ఛానెల్ కాబట్టి ఆ రేంజి మొత్తం ఇచ్చి ఆరెంజ్ రైట్స్ ని తీసుకున్నారని ఓ వర్గం అంటోంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో నాగబాబు ఈ చిత్రాన్ని దాదాపు 32 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు. అయితే రిలీజైన మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకోవటం మైనస్ గా మారింది. తర్వాత గ్రాడ్యువల్ గా కలెక్షన్స్ డ్రాప్ అవటం ప్రారంభించాయి. హీరో రామ్ చరణ్ మాత్రం నాలుగైదు రోజులు ఈ చిత్రం జనాల్లోకి పోవటానికి పడుతుందని, ఆ తర్వాత విజయం సాధించటం తధ్యమని హామీ ఇచ్చాడు కానీ ఆ మాట నిజం కాలేదు.