Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మహర్షి’ 4 డేస్ కలెక్షన్: రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రభంజనం
Recommended Video
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మే 9న విడుదలైన ఈ చిత్రం ఆదివారంతో విజయవంతంగా ఫస్ఠ్ వీకెండ్(4 డేస్) పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లాంటి బడా నిర్మాతలు రూపొందించిన చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేశారు. సూపర్ స్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే. విలువలతో కూడిన సందేశాత్మక చిత్రం కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో రూ. 49 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో తొలి 3 రోజుల్లోనే రూ. 40 కోట్ల షేర్ వసూలు చేసిన ‘మహర్షి' చిత్రానికి ఆదివారం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో టోటల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 49.13 కోట్లకు చేరుకుంది. ఫస్ట్ వీక్ పూర్తయ్యే సమయానికి ఈ చిత్రం ప్రాఫిట్ జోన్లోకి వెళ్లడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
నైజాంలో అదరగొడుతోంది
అన్ని ఏరియాలకంటే నైజాం ఏరియాలో వసూళ్లు అదిరిపోతున్నాయి. ఈ చిత్రం తొలి 4 రోజుల్లో ఇక్కడ రూ. 16.61 కోట్ల షేర్ వసూలు చేసింది. మొదటి రోజు రూ. 6 కోట్లకుపైగా షేర్ రాబట్టగా... ఆదివారం రూ. 3.47 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు నుంచి బాక్సాఫీసు వద్ద వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి.
మహేష్.. ఆడపిల్లగా పుడితే ఒప్పుకొనే వరకు వెంటపడేదానిని.. అందంగా లేవని పెళ్లాలు ప్రశ్నిస్తున్నారు
ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో..
ఆంధ్రా ఏరియాలో 4 డేస్ వసూళ్లు పరిశీలిస్తే... కృష్ణ జిల్లాలో రూ. 3.62 కోట్లు రాబట్టింది. ఇక్కడ ఫస్ట్ వీకెండ్ నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. దీంతో పాటు గుంటూరులో రూ. 5.90 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.6.13 కోట్లు, వెస్ట్ రూ. 3.74 కోట్లు, ఈస్ట్ రూ. 4.92 కోట్లు, సీడెడ్ రూ. 6.18 కోట్లు వసూలు చేసింది.
లాభాలు రావాలంటే ఎంత?
‘మహర్షి' ఏపీ తెలంగాణ రైట్స్ రూ. 72.10 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకు రూ. 50 కోట్ల షేర్ వసూలైంది. మిగతా మొత్తం రాబడితే ఈ చిత్రం లాభాల జోన్లోకి వెళుతుంది. అలాగే వరల్డ్ వైడ్ రైట్స్ రూ. 94 కోట్లకు అమ్మారు. అన్ని ఏరియాలకు సంబంధించిన వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది.
మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.