twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తగ్గిన సర్కారు వారి పాట.. నైజాంలో ప్రేక్షకులు ముఖం చాటేయడంతో టికెట్ రేట్ల తగ్గింపు.. ఎంతంటే?

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ వారం అంచనాలను తగ్గట్టుగా విడుదలైన విషయం తెలిసిందే. గీతగోవిందం సినిమా అనంతరం దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా అంచనాలు పెరుగుతాయని అనుకున్నారు. కానీ ఆ వర్గం ఆడియెన్స్ ఎక్కువగా రావడం లేదు. అయితే ఓపెనింగ్ డే రోజు సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ రెండవ రోజు ఊహించని విధంగా తగ్గాయి. దీంతో చిత్ర నిర్మాతలు టికెట్ల రేట్ల విషయంలో తగ్గక తప్పడం లేదు. ఇక నైజాంలో ఈ సినిమా టికెట్ల రేట్లు ఎంతవరకు వచ్చాయి. అనే వివరాల్లోకి వెళితే..

    మహేష్ కెరీర్ లోనే..

    మహేష్ కెరీర్ లోనే..

    మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఊహించినట్లు మంచి ఒపెనింగ్స్ అందుకుంది. ఫ్యాన్స్ కూడా సినిమా బావుందని ఫస్ట్ డే ఫస్ట్ షోకే సెలబ్రేట్ చేసుకున్నారు.

     వాళ్ళు అప్సెట్..?

    వాళ్ళు అప్సెట్..?

    అయితే ఓ వర్గం వారి నుంచి మాత్రం సినిమాకు అనుకున్నంతగా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంచనాలకు తగ్గట్టుగా లేదని కామెంట్స్ వచ్చాయి. అలాగే కీర్తి సురేష్ పాత్ర కూడా అంతగా ఏమి బాగోలేదని ఆమె ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. దీంతో మొదటి రోజే ఈవినింగ్ షోలకు కలెక్షన్స్ కొంత తగ్గాయి.

     డోస్ పెంచారు..

    డోస్ పెంచారు..

    ఇక సినిమా కలెక్షన్స్ తగ్గకూడదు అని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలాగే సినిమాలోని కామెడీ ఎమోషనల్ డైలాగ్స్ ప్రోమోలు కూడా వదులుతూ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా ఫ్యామిలీ ఆడియెన్స్ సర్కారు వారి పాట సినిమాకు ఎక్కువగా రావాలని నిర్మాతలు ప్రమోషన్ డోస్ పెంచుతున్నారు.

    టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండడంతో..

    టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండడంతో..

    ప్రమోషన్స్ తో పాటు సర్కారు వారి పాట యూనిట్ మరొక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. సినిమా టికెట్ల రేట్లు కూడా ఎక్కువగా ఉండడం ఒక విధంగా సినిమా కలెక్షన్స్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలి అంటే ఇప్పుడు రెండు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇక మధ్య తరగతి వారు ఆ విషయంలో ఇబ్బంది అడుతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

    సోమవారం నుంచి కొత్త రేట్లు

    సోమవారం నుంచి కొత్త రేట్లు

    ఇక ఫైనల్ గా చిత్ర నిర్మాతలు టికెట్ల రేట్ల విషయంలో కాస్త తగ్గారు. శనివారం ఆదివారం హాలిడేస్ కాబట్టి ఆడియెన్స్ వస్తారు. కానీ సోమవారం ఆడియెన్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉందని కొంత రేట్లు తగ్గించి 170 రూపాయలకు ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. నైజాం ఏరియాలో మొత్తం ఈ రేటుతో కొత్త టికెట్ల రేట్లు అందుబాటులో ఉంటాయని సమాచారం. మరి సినిమా ఆ రేటుతో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు నిర్మాతలు ప్రచారాలు మొదలు పెట్టారు. ఇక ప్రమోషన్స్ డోస్ పెంచే విధంగా సక్సెస్ ఈవెంట్స్ ను కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    mahesh babu Sarkaru vaari paata new ticket rates from Monday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X