Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Mahesh Babu: రాజమౌళి తరువాత మహేష్ చేయబోయే సినిమా వారితోనే.. అడ్వాన్స్ ఇచ్చేసిన బడా సంస్థ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పూర్తి స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోలేకపోయింది. చాలాచోట్ల సినిమా పెట్టిన పెట్టుబడికి కొన్ని నష్టాలను కూడా మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇక తదుపరి సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మరో సక్సెస్ అందుకోవాలని మహేష్ బాబు సిద్ధమవుతున్నాడు. అయితే మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు 30 ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
300కోట్ల బిజినెస్
మహేష్ బాబు తన తదుపరి సినిమాలో త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని ప్రొడక్షన్స్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. ఎస్ SSMB 28వ ప్రాజెక్ట్ గా తెరపైకి రాబోతున్న ఈ ప్రాజెక్టుకు ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం అర్జునుడు అనే ఒక టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఇంకా టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇక దాదాపు ఈ సినిమా 300 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సక్సెస్ కాకపోయినా..
సర్కారు వారి పాట థియేట్రికల్ గా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మహేష్ బాబు మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ అంటే తప్పకుండా మార్కెట్లో మంచి వ్యాల్యూ ఉంటుంది. ఇది వరకే వీరి కలయికలో అతడు ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు చేయబోయే మూడవ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.
రాజమౌళితో పాన్ ఇండియా
ఇక మహేష్ బాబు తన 29వ సినిమాను ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై కూడా అంచనాలు అయితే మామూలుగా లేవు. మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి ద్వారా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ లో KL నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించినున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
30వ సినిమా..
ఇక రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు స్టార్ హోదా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ఈజీగా పెరిగిపోతుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత మహేష్ బాబుతో ఎవరు సినిమా చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇటీవల మరోసారి మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా తోనే మైత్రి మూవీ మేకర్స్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి
మైత్రి మూవీ మేకర్స్ లోనే ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేశారు. అయితే మూడో సినిమాకు కమిట్మెంట్ కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహేష్ బాబు అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మహేష్ బాబును కలుసుకున్న మైత్రి నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు మహేష్ బాబుకు 50 కోట్ల వరకు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం.
దర్శకుడు ఎవరు?
ఇక రెమ్యునరేషన్ అయితే మొత్తంగా 75 కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. అప్పట్లో అయితే మహేష్ తో అనిల్ రావిపూడి ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అలాగే వంశీ పైడిపల్లి, సుకుమార్ లతో కూడా సినిమా చేయాల్సి ఉంది. మరి మహేష్ 30వ సినిమాకు ఏ డైరెక్టర్ సెట్టవుతాడో చూడాలి.