Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కలెక్షన్ల పరంగా దూసుకెళుతున్న ‘మజిలీ’... లేటెస్ట్ ఫిగర్ ఎంతో తెలుసా?
నాగ చైతన్య, సమంత, దివ్యాంన్ష కౌశిక్ ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మజిలీ'. ఏప్రిల్ 5న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుని నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.
తొలి రెండు వారాల్లోనే బాక్సాఫీసు వద్ద రూ. 50 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం తాజాగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాస్ టోటల్ రూ. 70 కోట్లకు చేరువైంది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబక్యూటర్లందరికీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
పోటీని తట్టుకుని స్టడీగా నిలబడిని ‘మజిలీ’
‘మజిలీ' థియేటర్లోకి వచ్చిన తర్వాత చిత్రలహరి, జెర్సీ, కాంచన 2, అవెంజర్స్-ది ఎండ్గేమ్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ మీద హిట్ టాక్తో ఎటాక్ చేశాయి. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు రేసులో స్టడీగా ఉంటూ మంచి వసూళ్లు రాబట్టింది.
4 వారాల టోటల్ గ్రాస్ రూ. 68.05 కోట్లు
తాజాగా బాక్సాఫీస్ వద్ద 4 వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 68.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంత భారీ మొత్తం వసూలు చేయడం నాగ చైతన్య కెరీర్లోనే ఇది తొలిసారి. ఇందులో మొత్తం రూ. 38.52 కోట్ల షేర్ రాబట్టింది.
ఏరియా వైజ్ కలెక్షన్ వివరాలు
మజిలీ ఏరియా వైజ్ కలెక్షన్లు పరిశీలిస్తే... నైజాం రూ. 13.02 కోట్లు, సీడెడ్ రూ. 4.48 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 4.52 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.92 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 1.38 కోట్లు, కృష్ణ రూ. 1.85 కోట్లు, గుంటూరు రూ. 2.08 కోట్లు, నెల్లూరు రూ. 92 లక్షలు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 4.40 కోట్లు, ఓవర్సీస్ రూ. 4.05 కోట్లు వసూలు చేసింది.
మజిలీ
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగ చైతన్య, సమంత లీడ్ రోల్స్ చేయగా... దివ్యాంన్ష కౌశిక్ అనే బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. గోపీ సుందర్ సంగీతం, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.