Don't Miss!
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఒంగోలు గిత్త' రైట్స్ తీసుకున్న మణిశర్మ
హైదరాబాద్ : రామ్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొంది ఈ రోజు విడుదల అవుతున్న చిత్రం 'ఒంగోలు గిత్త'. ఈ చిత్రం పశ్చిమ గోదావరి రైట్స్ ను ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సొంతం చేసుకున్నారు. చిత్రంపై ఉన్న నమ్మకంతో ఆయన ఈ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ... 'మిర్చీ యార్డ్ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్టైనర్ 'ఒంగోలు గిత్త'. ఇందులో రామ్ పాత్ర చిత్రణ కొత్త తరహాలో ఉంటుంది. నా గత చిత్రాల తరహాలో సున్నితమైన భావోద్వేగాలుంటూనే మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమా ఇది. మిర్చి యార్డుకు రామ్ పాత్రకు ఉన్న సంబంధం ఏమిటనేది తెరపైన చూడాల్సిందే' అన్నారు . శ్రీవెంక సినీ చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతికర్బందా హీరోయిన్ గా నటిస్తోంది.
నిర్మాత మాట్లాడుతూ.... చక్కని కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. బొమ్మరిల్లు, పరుగు లాంటి కుటుంబకథా చిత్రాల తర్వాత ఆ స్థాయిలో భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామ్ ఇమేజ్కు తగ్గట్టుగా ఎనర్జిటిక్గా వుంటుంది అన్నారు.
సమర్పకుడు బాపినీడు మాట్లాడుతూ... ప్యామిలీ టచ్ తో కూడిన మంచి మాస్ ఎంటర్ టైనర్ గా చిత్రం రూపొందింది. బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. మార్కెట్ యార్డు నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని వెల్లడించారు.
రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.