Don't Miss!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
బాక్సాఫీస్పై కంగన వసూళ్ల దాడి.. 100 కోట్ల క్లబ్పై మణికర్ణిక స్వైరవిహారం
వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. వివాదాల మధ్య ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లను సాధించింది. దర్శకత్వం అంశంపై క్రిష్ జాగర్లమూడి, కంగన రనౌత్ మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. మూడో వారాల్లో మణికర్ణిక సినిమా వంద కోట్ల క్లబ్కు చేరువైంది. గత మూడు వారాల్లో ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..
మూడో వారాంతం కలెక్షన్లు
మూడో వారాంతంలో అంటే శనివారం, ఆధివారం మణికర్ణిక సినిమా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం రూ.1.25 కోట్లు, శనివారం రూ.2.65 కోట్లు, ఆదివారం రూ.3.25 కోట్లు సాధించింది. మొత్తంగా మూడో వారాంతం కలెక్షన్లతో ఈ చిత్రం రూ.91.70 కోట్ల వద్ద నిలిచింది.
రూ.100 కోట్ల దిశగా
మణికర్ణిక చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిస్టారికల్ డ్రామాకు ప్రేక్షకుల ఆదరణ లభించడంతో ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. అదే ఊపుతో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరడానికి సిద్ధమైంది.
ఒక్కొక్కరి అంతు చూస్తా, రాసలీలలన్నీ బయట పెడతా.. వైరల్ అవుతున్న హీరోయిన్ వీడియో!
మూడోవారంలో కలెక్షన్లు
మణికర్ణిక చిత్రం తొలివారం ముగిసే సమయానికి రూ.61.15 కోట్లు వసూలు చేసింది. రెండోవారం ముగిసే సమయానికి రూ. 23.40 కోట్లు, మూడో వారాంతం రూ.7.15 కోట్లు రాబట్టింది. నాలుగో వారాంతానికి ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
క్రిష్, కంగన వివాదం
ప్రముఖ నిర్మాత కమల్ జైన్ రూపొందించిన మణికర్ణిక చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. టాలీవుడ్లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే అవకాశం రావడంతో మధ్యలోనే క్రిష్ ఈ ప్రాజెక్ట్కు గుడ్బై చెప్పారు. అనంతరం ఈ చిత్రాన్ని హీరోయిన్ కంగన రనౌత్ పూర్తి చేసింది. దర్శకత్వం టైటిల్ను కంగన వేసుకోవడంపై క్రిష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదంగా మారింది.