Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
భాక్సాఫీస్ ని రూల్ చేస్తున్న మెగా ఫ్యామిలీ
మరో ప్రక్క రామ్ చరణ్ వరసగా మూడు చిత్రాలతో తెరమీదకు దూకటానికి రెడీ అవుతున్నాడు. వాటిల్లో మొదటిది రామ్ చరణ్,వివివినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రానికి నాయక్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు చిత్రం కూడా రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ గా చేస్తున్నారు. మరో ప్రక్క జంజీర్ రీమేక్ చిత్రాన్ని తెలుగులో సైతం డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కు గానూ..యోగి డైరక్ట్ చేస్తున్నారు.
మరో ప్రక్కన పవన్ కళ్యాణ్ సైతం వరసగా సినిమాలు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ వంద రోజులు పండగ పూర్తయ్యేసరికి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మరో చిత్రం రిలీజ్ కు రెడీ చేసేస్తున్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబు టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరో ప్రక్క త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటయ్యారు. కుటుంబ అనుభందాలు,తెలుగు సంప్రదాయాలు నేపధ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రం స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. అల్లు అర్జున్ ..ఇద్దరు అమ్మాయిలుతో... పేరుతో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు.