Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ 'మిర్చి' ప్రీ రిలీజ్ బిజినెస్(ఏరియా వైజ్)
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రచయిత కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం 'మిర్చి'. ఈ చిత్రం పిప్రవరి 8న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లు. ఈ మధ్య కాలంలో మంచి బిజినెస్ జరుపుకున్న చిత్రంగా ఈ చిత్రాన్ని చెప్తున్నారు. ఆ బిజినెస్ డిటేల్స్( ట్రేడ్ లో ప్రచారంలో ఉన్న లెక్కలు) ఇలా ఉన్నాయి...
ప్రాంతం బిజినెస్ ( కోట్లలో)
------- --------------------------------------
నైజాం 8.40 ( దిల్ రాజు)
సీడెడ్ 5.40( ఎన్.వి ప్రసాద్ )
నెల్లూరు 1.50 ( శ్రీ నికేతన్ ఫిల్మ్స్ )
కృష్ణా 1.80 ( 14 రీల్స్)
గుంటూరు సొంత రిలీజ్
వైజాగ్ 3.25 ( ఎవి సినిమా)
ఈస్ట్ గోదావరి 1.90 ( అనుశ్రీ ఫిల్మ్స్ )
వెస్ట్ గోదావరి 1.70 ( షన్ముఖ ఫిల్మ్స్)
ఓవర్ సీస్ 2.30 ( గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ )
ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ సినిమాలో ప్రభాస్ వైవిధ్యమైన పాత్ర పోషించారు. ఆయన లుకింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తొలిసారిగా ఆయన కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ వ్యయంతో సినిమాని నిర్మించాం. కథ మీద కమాండ్తో హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్తో దర్శకుడు శివ చిత్రాన్ని రూపొందించారు.
గరం గరం మిర్చి తినడానికి ఎంత బాగుంటుందో అలాగే మా 'మిర్చి' సినిమా చూసి జనం అంత ఎంజాయ్ చేస్తారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సంగీత ప్రియులను అలరిస్తోంది' అని తెలిపారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం'రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యామీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్కుమార్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.