Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘మిషన్ మంగళ్’.. 200 కోట్లకు చేరువలో!
ఇటీవలే విడుదలైన 'మిషన్ మంగళ్' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల మార్కును దాటేసిన 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటి దాకా ఈ సినిమా 178.11 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితుడు తరన్ ఆదర్శ్ పేర్కొన్నాడు.
జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అక్షయ్ కుమార్తో పాటు విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్ను, క్రితి కుల్హరి, నిత్యా మీనన్, శర్మాన్ జోషి ముఖ్య పాత్రలు పోషించారు. ఇస్రో చేపట్టిన భారతదేశపు మొట్టమొదటి గ్రహాంతర మిషన్ - మార్స్ ఆర్బిటర్ మిషన్(మంగళ్యాన్) స్పూర్తితో దీన్ని తెరకెక్కించారు. మంగళ్యాన్ విజయంతో మార్షియన్ కక్ష్యకు చేరుకున్న మొట్టమొదటి ఆసియా దేశంగా భారత్ అవతరించడమే కాక, మొదటి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించిన దేశంగా ప్రపంచకీర్తిని గడించింది.
ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ. 29.16 కోట్లు రాబట్టడంతో అక్షయ్ కుమార్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. మొదటి వారంలో 128.16 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండో వారంలో 49.95 కోట్లు రాబట్టింది. మొత్తంగా చూస్తే 178.11 కోట్ల రూపాయలు వసూలు చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.