Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘మిషన్ మంగళ్’.. 200 కోట్లకు చేరువలో!
ఇటీవలే విడుదలైన 'మిషన్ మంగళ్' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల మార్కును దాటేసిన 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటి దాకా ఈ సినిమా 178.11 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితుడు తరన్ ఆదర్శ్ పేర్కొన్నాడు.
జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అక్షయ్ కుమార్తో పాటు విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్ను, క్రితి కుల్హరి, నిత్యా మీనన్, శర్మాన్ జోషి ముఖ్య పాత్రలు పోషించారు. ఇస్రో చేపట్టిన భారతదేశపు మొట్టమొదటి గ్రహాంతర మిషన్ - మార్స్ ఆర్బిటర్ మిషన్(మంగళ్యాన్) స్పూర్తితో దీన్ని తెరకెక్కించారు. మంగళ్యాన్ విజయంతో మార్షియన్ కక్ష్యకు చేరుకున్న మొట్టమొదటి ఆసియా దేశంగా భారత్ అవతరించడమే కాక, మొదటి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించిన దేశంగా ప్రపంచకీర్తిని గడించింది.
ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ. 29.16 కోట్లు రాబట్టడంతో అక్షయ్ కుమార్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. మొదటి వారంలో 128.16 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండో వారంలో 49.95 కోట్లు రాబట్టింది. మొత్తంగా చూస్తే 178.11 కోట్ల రూపాయలు వసూలు చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.