Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అదీ నందమూరి హీరో స్టామినా.... ‘ఎంఎల్ఏ’ బిజినెస్ అదరగొట్టాడుగా!
Recommended Video
అటు నిర్మాతగా సినిమాలు తీస్తూనే ఇటు నటుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు హీరో కళ్యాణ్ రామ్. త్వరలో ఈ నందమూరి హీరో 'ఎంఎల్ఏ' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 23న సినిమా విడుదల కాబోతోంది. 'పటాస్' తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్కు గత చిత్రం 'ఇజం' నిరాశ మిగిల్చింది. దీంతో 'ఎంఎల్ఏ' సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టింది
‘ఎంఎల్ఏ' చిత్రం టీజర్, ప్రోమోలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. రూ. 22 కోట్ల వద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు సమాచారం.
ఎక్కడెక్కడ ఎంత? అంటే...
‘ఎంఎల్ఏ' నైజాం ఏరియా రైట్స్ రూ. 4.2 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. సీడెడ్ రూ. 2.5 కోట్లు, ఆంధ్రా ఏరియాలో అన్ని టెర్రిటరీలు కలిపి రూ. 6.3 కోట్ల బిజినెస్ జరిగినల్లు సమాచారం. దీంతో ఓవర్సీస్ రైట్స్ రూపంలో రూ. 5 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
రూ. 25 కోట్లు టార్గెట్
‘ఎంఎల్ఏ' చిత్రం బాక్సాఫీస్ టార్గెట్ రూ. 25 కోట్లుగా పెట్టుకున్నట్లు సమాచారం. అందుకు తగిన విధంగానే సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లు కూడా అదే స్థాయిలో నిర్వహించనున్నారు.
గ్రాండ్ రిలీజ్
మార్చిన 23న ‘ఎంఎల్ఏ' చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయబోతేన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఉపేంద్ర మాధవ్. కాజల్ అగర్వాల్ హీరోయిన్. కాగా, నేడు జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంటుకు కళ్యాణ్ రామ్ సోదరుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవుతాడని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ హాజరయ్యే విషయంలో అధికారిక ప్రకటన అయితే ఏదీ లేదు. ఈ విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. నందమూరి అభిమానులు మాత్రం ఎన్టీఆర్ హాజరు కావాలని కోరుకుంటున్నారు.