Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
‘సీతమ్మ వాకిట్లో...’కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?
హైదరాబాద్ : మహేష్బాబుతో కలిసి వెంకటేష్ నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సమంత హీరోయిన్. అంజలి, ప్రకాష్రాజ్, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో మాత్రం ఓ రేంజిలో దుమ్ము రేపుతోందని ట్రేడ్ టాక్.
ఉన్న థియోటర్స్ విపరీతమైన రద్దీతో ఉండటంతో చాలా టౌన్స్ లో థియోటర్స్ ని పెంచి ప్రదర్శిస్తున్నారు . అలాగే చాలా చోట్ల ఈ సంక్రాంతి మూడు రోజు రోజులు ఉదయం ఆరు గంటల నుంచి షో లు ప్రారంభించి, షోలు పెంచి ప్రదర్శిస్తున్నారు. మహేష్ కొత్త సినిమా కావటం, ఫ్యామిలీలు టార్గెట్ కావటం ఈ సినిమాకు కలిసి వచ్చింది. అయితే సంక్రాంతి వెళ్లిన తర్వాత కూడా కలెక్షన్స్ ఇలాగే స్టాండ్ గా నిలబడి ఉంటాయా లేదా అన్న విషయంపై విజయం రేంజి ఆధారపడి ఉంటుంది.
చిత్రం కలెక్షన్స్ పై దిల్ రాజు సంతృప్తిగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ... "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు వస్తున్న స్పందన అమోఘం. కన్నీటిపొర ఆగలేదు. ఏడాది పాటు నేను పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాను'' అని దిల్రాజు అన్నారు. నా ప్రతి సినిమా విడుదలైనప్పుడు క్రాస్ రోడ్కెళ్ళి సెకండ్ షో చూసిన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వినడం అలవాటు. సీతమ్మ వాకిట్లో.. చూసిన వారు దగ్గరికొచ్చి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదంతా చూస్తుంటే పండుగ ముందే వచ్చిందా అనిపించింది అన్నారు.
అలాగే తాము మర్చిపోయిన ఇలాంటి కథను మేం తెరకెక్కించినందుకు చాలా ఆనందంగా ఉందని రాఘవేంద్రరావుగారు చె'ప్పడం ఆనందదాయకం. ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లలోనూ వస్తున్న రెస్పాన్స్ను ఎప్పటికప్పుడు ప్రకాష్రాజ్ మాకు అందించారు. దాదాపు పాతికేళ్ళ తర్వాత తీసిన మల్టీస్టారర్కు ఎలాంటి స్పందన వస్తుందోనని శుక్రవారం ఉదయం రెండు గంటలు చాలా టెన్షన్ పడ్డాను. కానీ అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో హాయిగా ఊపిరిపీల్చుకున్నాను. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహిస్తాం. '' అని అన్నారు.