twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mosagallu, Chavu Kaburu Challaga collections: 5రోజులైనా మారని పరిస్థితి.. ఇంకెంత రావాలంటే?

    |

    కరోనా ప్రభావం ఉన్నప్పటికీ సినిమాలపై పెద్దగా ఎఫెక్ట్ పడలేదని కొన్ని సినిమాలతో చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం అనుకున్నంత రేంజ్ లో వసూళ్లు అందుకోకపోవడం ఆశ్చర్యకరం. చావు కబురు చల్లగా ఓ వర్గం ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లను అందుకోలేకపోతోంది. ఇక మోసగాళ్ళు పరిస్థితి 5రోజులైనా కూడా మారలేదు.

    కంటెంట్ క్లిక్కయితే

    కంటెంట్ క్లిక్కయితే

    కంటెంట్ క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కు అడ్డుకట్ట వేయడం ఎవరి వల్ల కాదు. కొన్ని సినిమాలు మొదట్లో తక్కువ కలెక్షన్స్ అందుకున్నప్పటికి ఆ తరువాత పాజిటివ్ టాక్ తో ఒక్కసారిగా కలెక్షన్స్ ను పెంచుకుంటూ ఉంటాయి. జాతిరత్నాలు మొన్నటి వరకు కూడా అలానే కొనసాగింది. అయితే మోసగాళ్ళు , చావు కబురు చల్లగా అలానే క్లిక్లవుతాయని నమ్మినప్పటికి వర్కౌట్ కాలేదు.

    ముందుగానే 30కోట్లు వచ్చేశాయి

    ముందుగానే 30కోట్లు వచ్చేశాయి

    మంచు విష్ణు తన సొంత బ్యానర్ లో 50కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన మోసగాళ్ళు సినిమా నాన్ థియేట్రికల్ గా ముందుగానే 30కోట్లకు పైగా లాభాలను అందించింది. సినిమాను రిలీజ్ చేసేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతో సొంతంగానే రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. 20కోట్ల టార్గెట్ తో ఈ సినిమాను మార్కెట్ లోకి వదిలారు.

    మోసగాళ్ళు 5రోజుల కలెక్షన్స్

    మోసగాళ్ళు 5రోజుల కలెక్షన్స్

    మోసగాళ్ళు సినిమా మొదటి రోజు నుంచి కూడా డల్ గానే కొనసాగుతోంది. మొదటి రోజు కనీసం రెండు కోట్ల షేర్ కూడా రాలేదు. నాలుగవ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 0.77కోట్ల షేర్స్ మాత్రమే వచ్చాయి. ఇక 5వ రోజు 2లక్షలు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు సినిమా కనీసం వరల్డ్ వైడ్ గా మూడు నాలుగు కోట్లయినా రాబట్టలేకపోయింది. సినిమా నష్టపోకుండా ఉండాలంటే ఇంకా 18కోట్ల వరకు షేర్ రావాలి.

    చావు కబురు చల్లగా.. 5వ రోజు ఎంతంటే

    చావు కబురు చల్లగా.. 5వ రోజు ఎంతంటే

    యువ హీరో కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి అయితే పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా కార్తికేయ నటనకు మంచి క్రేజ్ దక్కింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే 1.58కోట్ల వరకు షేర్ రాబట్టింది. కానీ ఆ తరువాత కలెక్షన్స్ మెల్లగా తగ్గుతూ వచ్చాయి. 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8లక్షల షేర్ మాత్రమే వచ్చింది.

    ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే..

    ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే..

    చావు కబురు చల్లగా టోటల్ గా 13.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి దిగింది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 3కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. అంటే మరో 10కోట్లను అందుకుంటేనే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు. మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

    English summary
    It is a known fact that back-to-back movies are being released again in the Tollywood industry. Producers who had a lot of trouble due to the corona lock-down bravely released the films as a whole. However, if some of the films hit, other films are receiving outrageous collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X